Kids

తెలంగాణా ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత అల్పాహారం

తెలంగాణా ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత అల్పాహారం

ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో (1 నుంచి 10 తరగతి వరకు) చదువుకునే విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘ ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ (CM Breakfast Scheme) పేరుతో అల్పాహారం అందించనున్నట్లు సర్కారు జీవో జారీచేసింది. దసరా రోజు అనగా అక్టోబర్-24 నుంచి ఈ పథకంగా ప్రారంభం కానుంది. పాఠశాల పనిదినాల్లో మాత్రమే ఉదయం పూట టిఫిన్ (Tiffin) లాగా అందించునున్నారు. ఈ పథకం వల్ల ప్రభుత్వంపై రూ. 400 కోట్ల అదనపు భారం పడనుందని కేసీఆర్ సర్కార్ పేర్కొంది. కాగా ఇప్పటికే మధ్యాహ్నం భోజన పథకం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో అమలవుతున్న విషయం తెలిసిందే.