DailyDose

ఏపీలో వీఆర్‌వోలకు శుభవార్త

ఏపీలో వీఆర్‌వోలకు శుభవార్త

వీఆర్‌వోలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. విఆర్వోల కోసం ప్రత్యేక జీవోలు తీసుకువచ్చింది జగన్‌ సర్కార్‌. విఆర్వోల కోసం ప్రభుత్వం 154,64,6538,166,31 జీవోలు జారీ చేసిందని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్రరాజు తెలిపారు. వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపేందుకు త్వరలో రాష్ట్రస్థాయిలో విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఏపీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశంలో రవీంద్రరాజు తెలిపారు. రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ పదోన్నతులలో విఆర్వోలకు ప్రస్తుతం ఉన్న కోట 40% నుంచి 70 శాతానికి పెంచాలన్నారు. అలాగే ఖాళీగా ఉన్న సీనియర్ సహాయకుల పోస్టులలో వన్ టైం సెటిల్మెంట్ ప్రకారం 70% పదోన్నతులను వీఆర్వోలతో భర్తీ చేయాలని కోరారు. సర్వే సప్లిమెంటరీ పరీక్షలు రాసిన గ్రేడ్ -2 విఆర్వోల ఫలితాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘాన్ని గుర్తింపు సంఘంగా ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z