Politics

కేంద్రానికి జగన్ సర్కార్ లేఖ

కేంద్రానికి జగన్ సర్కార్ లేఖ

కాలేశ్వరం ప్రాజెక్టు పై కేంద్రానికి జగన్ సర్కార్ లేఖ రాసింది. తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతులను పునఃసమీక్షించాలని కేంద్రానికి జగన్ సర్కార్ లేఖ రాసింది. తెలుగు రాష్ట్రాలకు గోదావరి జలాల పంపిణీకి..ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయండని కేంద్రానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.ఈ మేరకు కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాశారు. జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం ఉమ్మడి రాష్ట్ర పరిధిలో గోదావరిలో నీటి లభ్యతను తేల్చాలని.. ఆ అవార్డు, అప్పటి ఒప్పందాల ఆధారంగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలని ఈ లేఖలో పేర్కొన్నారు. దిగువ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రయోజనాలను పరిరక్షించేలా నియమావళి రూపొందించాలని కోరారు. తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతులను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను నిలుపుదల చేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని లేఖలో వివరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z