Politics

భారాస ప్రభుత్వం యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మారుస్తోంది

భారాస ప్రభుత్వం యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మారుస్తోంది

భారాస ప్రభుత్వం యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మారుస్తోందని కరీంనగర్‌ ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ఆరోపించారు. కరీంనగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారాస, కాంగ్రెస్‌ పార్టీల డీఎన్‌ఏల్లో బీసీలపై వ్యతిరేకత ఉందన్నారు. బీసీ, దళితులను సీఎం అభ్యర్థిగా భారాస ప్రకటిస్తుందా అని సంజయ్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గెలిపిస్తే భారాసకు అమ్ముడుపోతారన్నారు. భారాస నుంచి విముక్తి పొందాలంటే భాజపాను గెలిపించాలని ఆయన కోరారు. రెండురోజుల క్రితం కరీంనగర్‌ అసెంబ్లీ స్థానానికి బండి సంజయ్‌ నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z