DailyDose

బాలికపై ఇద్దరు ఉపాధ్యాయులు అత్యాచారం-నేర వార్తలు

బాలికపై ఇద్దరు ఉపాధ్యాయులు అత్యాచారం-నేర వార్తలు

బాలికపై ఇద్దరు ఉపాధ్యాయులు అత్యాచారం

11 సంవత్సరాల విద్యార్థినిపై ఇద్దరు ఉపాధ్యాయులు అత్యాచారం చేసిన సంఘటన ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విద్యార్థిని (11) ఐదో తరగతి చదువుతోంది. బాత్రూమ్‌కు వెళ్లిన బాలికపై ప్రధానోపాధ్యాయుడు మరో టీచర్‌తో కలిసి సామూహిక అత్యాచారం చేశారు. కడుపులో నొప్పి వస్తుందని బాలిక ఇంట్లో పడిపోవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. బాలికపై లైంగిక దాడి జరిగిందని వైద్యులు తెలపడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో తండ్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి బాలికను ఆరోగ్య పరీక్షల నిమిత్తం మరో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరు ఉపాధ్యాయులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఏలూరులో మహిళ దారుణ హత్య

ఈ క్రమంలో షేక్ సుభాని అనే వ్యక్తి తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నది మహిళ. అయితే ఏం జరిగిందో ఏమోగానీ.. మహిళ పైన షేక్ సుభాని విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం నిందితుడు పోలీసు స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. అయితే హత్యకు గల కారణాలు తెలియలేదు.. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయని.. ఆ మనస్పర్థల కారణంగానే నిందితుడు హత్య చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ నిందితుడి అంగీకారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ క్రమంలో షేక్ సుభాని అనే వ్యక్తి తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నది మహిళ. అయితే ఏం జరిగిందో ఏమోగానీ.. మహిళ పైన షేక్ సుభాని విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం నిందితుడు పోలీసు స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. అయితే హత్యకు గల కారణాలు తెలియలేదు.. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయని.. ఆ మనస్పర్థల కారణంగానే నిందితుడు హత్య చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ నిందితుడి అంగీకారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రియురాలి ఇంటికి వెళ్లి బలైన యువకుడు

మైనర్ బాలికతో ప్రేమ వ్యవహారం, అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడిని తల్లిదండ్రులు, బంధువులు దారుణంగా కొట్టి చంపేసిన ఘటన హైదరాబాద్‌ నగరంలో చోటు చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కిరణ్ (18) అనేక యువకుడు తను ప్రేమించిన మైనర్‌ బాలికను కలుసుకునేందుకు.. ఆమె తల్లిదండ్రులు లేని సమయంలో బాలిక ఇంటికి వెళ్లాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది.. సమాచారం అందుకున్న బాలిక తల్లిదండ్రులు వెంటనే ఇంటికి చేరుకుని యువకుడిని పట్టుకుని చితకబాదారు. యువతి బంధువులు సైతం యువకుడిపై దాడికి దిగారు.. అతడి ప్రైవేట్ పార్ట్స్ లో కారం పోసి కిరాతంగా దాడి చేశారు. దాదాపు గంటసేపు దాడి చేసిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు.అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 18 ఏళ్ల మృతుడు కిరణ్, అదే పరిసర ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికకు కొంతకాలంగా సంబంధం ఉంది. ఈ విషయం బాలిక కుటుంబీకులు తెలుసుకుని యువకుడిని పలుమార్లు హెచ్చరించారు. మరోసారి కలిసి కనిపిస్తే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారని తెలిసింది. అయితే కిరణ్ మాత్రం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. బుధవారం, బాలిక తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్తూ.. వారు ఇంట్లో లేని సమయంలో తమ ఇంటిపై నిఘా ఉంచాలని ఇరుగుపొరుగు వారిని కోరారు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న కిరణ్ రాత్రి బాలిక ఇంటికి వెళ్లాడు. అతను రావడం గమనించిన స్థానికులు వెంటనే బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని అతడిని పట్టుకుని విచక్షణా రహితంగా కొట్టారు. దెబ్బలకు తాలలేక యువకుడు అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాలిక తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కాగా, మృతుడి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అప్పటికిగానీ,మృతుడి తల్లిదండ్రులు, బంధువులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు.

*  కన్నకూతురినే అత్యంత దారుణంగా చంపిన తండ్రి

భూ, ఆస్తి వివాదంతో తన కన్న కుమార్తెతో పాటు అల్లుడు‌పై ఓ తండ్రి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. కూతురు అల్లుడుపై ఆ తండ్రి గొడ్డలి, కత్తితో దాడి చేయడంతో ఆ కూతురు అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అల్లుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామంలో శుక్రవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వైరా మండలం తాటిపూడి గ్రామంలో భూ, ఆస్తులు వివాదంతో ఆ గ్రామానికి చెందిన పిట్టల రాములు తన కన్న కూతురు, అల్లుడిపై గొడ్డలి, కత్తితో నరికి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఈ సంఘటనలో కూతురు పరిసబోయిన ఉషశ్రీ (35) అక్కడికక్కడే మృతి చెందింది. అల్లుడు కృష్ణ పరిస్థితి విషమించటంతో అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని వైరా ఏసిపి రహమాన్, సీఐ సాగర్ ఎస్సై మేడ ప్రసాద్ పరిశీలించి కేసు నమోదు చేశారు. తాటిపూడి గ్రామానికి చెందిన తండ్రి పిట్టల రాములుకి కుమార్తె ఉషశ్రీకి ఆస్తులు విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా వివాదం నెలకొంది. ఉషశ్రీ తాత మన్యం వెంకయ్యకు సంబంధించిన ఆస్తిని మనవరాలు ఉషశ్రీ పేరుతో రిజిస్టర్ చేయటంతో ఈ వివాదం ఏర్పడింది.వివాదంపై గత కొన్ని సంవత్సరాలుగా కోర్టు చుట్టూ ఇరువర్గాలు తిరిగిన పరిష్కారం కాలేదు. శుక్రవారం ఉదయం ఉషశ్రీ ఇంటి వద్ద తండ్రి పిట్టల రాములు మధ్య వాగ్వి వాదం జరిగింది. వివాదం తీవ్రం కావడంతో తండ్రి పిట్టల రాములుతో పాటు అతని కుమారులు నరేష్, వెంకటేష్ గొడ్డలి, కత్తి తీసుకొని కూతురు ఉషశ్రీ, అల్లుడు కృష్ణపై దాడి చేశారు. ఈ సంఘటనలో ఉషశ్రీ అక్కడికక్కడే మృతి చెందింది. కృష్ణకు తీవ్ర గాయాలయి పరిస్థితి విషమించటంతో స్థానికులు అంబులెన్స్ లో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన వైరా మండల వ్యాప్తంగా చర్చినీయాంశంగా అయింది.

మద్యంమత్తులో తాగుబోతు వీరంగం

నేటి బిజీ ప్రపంచంలో మనం సామాజిక మాధ్యమాలతో ముడిపడి జీవిస్తున్నాం. ఎందుకంటే ఇంటర్నెట్ ఒక ప్రత్యేక ప్రపంచంలా పనిచేస్తుంది. ప్రజలు ఇప్పుడు డ్రగ్స్ బానిసల మాదిరిగానే ఇంటర్నెట్‌కు బానిసలయ్యారు. ఎందుకంటే ఇక్కడ మనం చాలా విభిన్న విషయాల గురించి తెలుసుకుంటాం. అలాగే ఇక్కడ షేర్ చేయబడిన వార్తలు, ఫోటోలు, వీడియోలు మనకు అనేక వార్తలు, సమాచారాన్ని అందిస్తాయి. ఇంతకీ ఇక్కడ మనం చెప్పుకోబోయే అసలు విషయం ఏంటంటే.. ఇది కొన్ని సరదా విషయాలతో పాటు చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని కూడా అందిస్తుంది. ఇంటర్నెట్‌లో షేర్ చేయబడిన వీడియోలు మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే టెన్షన్‌ల నుండి కాస్త రిలాక్స్ అవ్వడానికి సహాయపడతాయి. వీటిలో జంతువులకు సంబంధించిన వీడియోలకు ప్రత్యేక అభిమానుల సంఖ్య ఉంటుంది. ముఖ్యంగా  వీడియోకు ఎప్పుడూ ప్రజల్లో ఆదరణ ఎక్కువగా ఉంటుంది.పాములు నిస్సందేహంగా ఇంటర్నెట్‌ హీరోలని చెప్పాలి. పాము వీడియోలపై నెటిజన్లు ఎప్పటినుంచో ఎక్కువగా లైక్‌ చేస్తుంటారు. ఎక్కువ వ్యూస్‌ కూడా పాముల వీడియోలకే వస్తుంటాయి. మానవులను ఎక్కువగా ఆకర్షించిన జీవులలో పాములు ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన జీవులలో ఒకటిగా పరిగణించబడుతున్నప్పటికీ, వాటిపై ప్రజల్లో ఉన్న ఇష్టం మాత్రం తగ్గదు. కొన్ని సంప్రదాయాలలో పాములను దేవతలుగా కూడా పూజిస్తారు. వీటి గురించి అనేక కథలు, జానపద కథలు ఉన్నాయి. ఈ విషయాలపై మనకు ఇంకా ఆసక్తి ఉండడం సహజం. అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో పాముల వీడియోలు చాలా షేర్ అవుతున్నాయి.

జవాన్ ప్రాణం తీసిన హనీట్రాప్

హనీట్రాప్ పేరుతో ఓ మహిళ వేధించడంతో జవాన్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రంలో మడికేరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సందేశ్ అనే వ్యక్తి భారత సైన్యంలో సైనికుడిగా పని చేస్తున్నాడు. తాను ఆత్మహత్య చేసుకుంటానని లేఖలో రాసి ఇంట్లో నుంచి సందేశ్ బయటకు వెళ్లిన తరువాత తల్లి గుర్తించింది. వెంటనే మడికేరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగారు. హంపినకెరెలో నీటిలో ఆయన మృతదేహం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 40 అడుగుల లోతులో మృతదేహం ఉన్నట్టు గజ ఈతగాళ్లు గుర్తించడంతో అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని నీళ్లలో నుంచి బయటకు తీశారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సూసైడ్ లేఖ ఆధారంగా జీవిక అనే మహిళ, కానిస్టేబుల్, రిసార్టు యజమాని వేధించినట్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z