NRI-NRT

న్యూజెర్సీలో ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం

న్యూజెర్సీలో ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం

‘మేము సైతం బాబు కోసం’ అంటూ అమెరికాలోని న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ప్రవాసాంధ్రులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం ఏపీ కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నాయకులు మన్నవ మోహనకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ మచ్చలేని నేత చంద్రబాబు నాయుడికి అవినీతి రంగు పూయడానికి జగన్ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. నీతి నిజాయతీలకు నిలువుటద్దమైన చంద్రబాబు నాయుడికి ఆపద కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలతో పాటు ప్రవాసాంధ్రులు కూడా వెన్నుదన్నుగా నిలిచారన్నారు. రానున్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ మనుగడకే పరీక్ష అని, రాష్ట్రాన్ని నిలబెట్టడానికి, తెలుగుదేశం పార్టీ- జనసేన కూటమిని గెలిపించడానికి ప్రతి ప్రవాసాంద్రుడూ వెన్నుదన్నుగా నిలవాలని మన్నవ మోహనకృష్ణ కోరారు.

ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు ‘మేము సైతం బాబు కోసం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ బాబుకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం ఆమోదించారు. 2024 ఎన్నికల్లో తెదేపా- జనసేన కూటమికి అమెరికాలోని తెలుగు ప్రజలతో పాటు విదేశాల్లోని ప్రతి ఆంధ్రుడూ సంఘీభావంగా నిలవాలని కోరుతూ ఆత్మీయ సమావేశం తీర్మానించింది. విపరీతమైన చలిలోనూ 500 మందికి పైగా ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి శ్రీహరి మందడి, రమేష్ నూతలపాటి, మోహన్ కుమార్, వంశీ వెనిగళ్ల, వెంకట్ సూడ విశేషంగా కృషి చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z