Politics

19న అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ

19న అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ

ఈ నెల 19న అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరిస్తారని ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ అన్నారు. రూ. 400 కోట్లతో ఈ నిర్మాణం జరిగిందని, అంబేద్కర్ స్మృతివనంలో అన్ని సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. తెలంగాణలో ఒక్క విగ్రహం మాత్రమే పెట్టారని, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీగా ఈ విగ్రహం పిలవబడుతుందన్నారు. రేపటి నుంచి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామానా అనేక కార్యక్రమాలు చేస్తామని విక్టర్ ప్రసాద్ వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z