Movies

‘గుంటూరు కారం’ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

‘గుంటూరు కారం’ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా నటించిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌లలో రూ.65, మల్టీప్లెక్స్‌లలో రూ.100 పెంచేందుకు వెసులుబాటు కల్పించింది. మహేశ్‌ అభిమానులను దృష్టిలో పెట్టుకుని బెనిఫిట్ షోల ప్రదర్శనకు కూడా ఓకే చెప్పింది. రాష్ట్రంలో 23 చోట్ల ఈనెల 12న అర్ధరాత్రి 1 గంట షో ప్రదర్శించనున్నారు. పండగ సందర్భంగా ‘గుంటూరు కారం’ ఆరో షో ప్రదర్శనకు కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం 4 గంటల షోలను ప్రదర్శించనున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. హాసిని, హారిక క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించగా, తమన్‌ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో మహేశ్‌బాబు ఎనర్జిటిక్‌గా నటించారంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z