Sports

మలేషియా ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్న సాత్విక్-చిరాగ్

మలేషియా ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్న సాత్విక్-చిరాగ్

కౌలాలంపూర్‌: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షట్లర్లు సాత్విక్‌‌‌‌‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌ షెట్టి.. మలేసియా ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–1000 టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌లో రెండోసీడ్‌‌‌‌‌‌‌‌ సాత్విక్‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌ 21–18, 22–20తో వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ సియో సియోంగ్‌‌‌‌‌‌‌‌ జావో–కాంగ్‌‌‌‌‌‌‌‌ మిన్‌‌‌‌‌‌‌‌ హుయుక్‌‌‌‌‌‌‌‌ (కొరియా)పై గెలిచారు. 47 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియన్‌‌‌‌‌‌‌‌ జోడీ రెండో గేమ్‌‌‌‌‌‌‌‌లో అద్భుతంగా పోరాడింది.

ఆరు గేమ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లను కాచుకుంటూ వరుసగా ఎనిమిది పాయింట్లు నెగ్గి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ప్రత్యర్థులపై ముఖాముఖి రికార్డును 3–1కి పెంచుకుంది. తొలి గేమ్‌‌‌‌‌‌‌‌లో కొరియన్లు షార్ట్‌‌‌‌‌‌‌‌ ర్యాలీస్‌‌‌‌‌‌‌‌, తెలివైన స్ట్రోక్స్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్నారు. కానీ చిరాగ్‌‌‌‌‌‌‌‌ బలమైన రిటర్న్స్‌‌‌‌‌‌‌‌తో చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టాడు. రెండో గేమ్‌‌‌‌‌‌‌‌లో 3–3తో స్కోరు సమమైన తర్వాత సియోంగ్‌‌‌‌‌‌‌‌–మిన్‌‌‌‌‌‌‌‌ హుయక్‌‌‌‌‌‌‌‌ వరుస పాయింట్లతో చెలరేగిపోయారు. ఓ దశలో 14–11, 20–14తో ఆధిక్యంలో నిలిచారు. కానీ పట్టువిడవకుండా పోరాడిన ఇండియన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు బలమైన స్మాష్‌‌‌‌‌‌‌‌లు, క్రాస్‌‌‌‌‌‌‌‌ కోర్టు విన్నర్లతో అపోనెంట్స్‌‌‌‌‌‌‌‌కు ఒక్క పాయింట్‌‌‌‌‌‌‌‌ కూడా ఇవ్వలేదు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z