వాట్సప్ స్టేటస్ ఓ బాలుడి ప్రాణం తీసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నార్సింగి ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం గండిపేట మండల మణికొండ పుప్పాలగూడలో అన్వర్ ఉల్ ఖురాన్ అనే మదర్సా ఉంది. ఇందులో పలు రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉర్దు చదువుకుంటున్నారు. జనవరి 19 న ఉదయం బీహార్ కు చెందిన మైనర్ బాలురు రకీమ్, సిరాజ్లు ఫోన్లో స్టేటస్ విషయంపై గోడవ పడ్డాడు. రకీమ్ అనే వ్యక్తి సిరాజ్ను బలంగా కోట్టడంతో సిరాజ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు మదర్సా నిర్వహకులకు చెప్పగా వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సిరాజ్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –