Movies

‘గుంటూరు కారం’ హవా కాస్త తగ్గిందా?

‘గుంటూరు కారం’ హవా కాస్త తగ్గిందా?

సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ హవా కాస్త తగ్గింది. ఈ సినిమా ఆడుతున్న థియేటర్లలో కొన్నిచోట్ల ‘హనుమాన్’ కనిపిస్తోంది. ఇకపోతే సంక్రాంతి కానుకగా రిలీజైన మహేశ్ సినిమా.. ఊహించని విధంగా బెన్ ఫిట్ షోల నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా టాక్ ఏం మారలేదు. అయితే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ విషయంలో ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

‘గుంటూరు కారం’ సినిమాలో మహేశ్ యాక్టింగ్ తప్పితే మిగతా వాటిపై ప్రేక్షకులు డిసప్పాయింట్ అయ్యారు. డైరెక్టర్ త్రివిక్రమ్‪‌తో పాటు సంగీత దర్శకుడు తమన్‌పై విమర్శలు గట్టిగానే వచ్చాయి. అయితే చిత్రబృందం మాత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌కి తమ సినిమా నచ్చేసిందని చెబుతోంది. వీటి సంగతి పక్కనబెడితే వారంలో రూ.212 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.

సరే ‘గుంటూరు కారం’ టాక్-కలెక్షన్స్ గురించి కాసేపు పక్కనబెడితే ఓటీటీ రిలీజ్ విషయమై ఇప్పుడు ఓ టాక్ వినిపిస్తోంది. డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్.. చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మహేశ్ కొత్త సినిమాని 28 రోజుల్లోపే ఓటీటీలోకి తీసుకురానుందని సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే ఫిబ్రవరి రెండో వారంలో అంటే 9 లేదా 10వ తేదీన ‘గుంటూరు కారం’ ఓటీటీలో వచ్చేయొచ్చు. అయితే ‘సలార్’ ఓటీటీ విడుదలనే దీనికి ఉదాహరణగా చూపిస్తున్నారు.

ఎందుకంటే డిసెంబరు 22న థియేటర్లలోకి వచ్చిన సలార్.. జనవరి 20న ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో ‘హనుమాన్’ విన్నర్‌గా నిలిచింది. ‘గుంటూరు కారం’, ‘నా సామి రంగ’ చిత్రాలు పాస్ కాగా.. ‘సైంధవ్’ సినిమా సరైన ప్లానింగ్ లేకుండా వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో దారుణంగా ఫెయిలైనట్లు తెలుస్తోంది. సో అదన్నమాట విషయం.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z