NRI-NRT

NTR జిల్లా రోలుపడిలో మన్నవ-కిలారు ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు

NTR జిల్లా రోలుపడిలో మన్నవ-కిలారు ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు

గుంటూరు జిల్లాకు చెందిన ప్రవాసాంధ్ర ప్రముఖుడు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న MMK ట్రస్ట్ – NTR జిల్లా తిరువూరు మండలం రోలుపడికి చెందిన కిలారు ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో రోలుపడి గ్రామ పంచాయతీలోని రోలుపడి-రాజీవ్‌నగర్-సూరవరం గ్రామాలకు చెందిన వయోవృద్ధులకు రగ్గులు, దుప్పట్లను పంపిణీ చేశారు. ₹15వేల విలువైన రగ్గులను మోహనకృష్ణ కిలారు ఫౌండేషన్‌కు అందజేశారు. వీటిని కిలారు ఫౌండేషన్ ప్రతినిధులు మాజీ సర్పంచ్ కిలారు రమేష్, మాజీ జడ్పీటీసీ కిలారు బిందులు రోలుపడిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో 85 మంది వృద్ధులకు అందజేశారు. MMK ట్రస్ట్-కిలారు ఫౌండేషన్లకు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z