Fashion

నూడుల్స్‌లో కోట్ల రూపాయిల వజ్రాలు స్మగ్లింగ్-CrimeNews-Apr 23 2024

నూడుల్స్‌లో కోట్ల రూపాయిల వజ్రాలు స్మగ్లింగ్-CrimeNews-Apr 23 2024

* మహబూబాబాద్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమ మహ్మద్‌ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు నిర్వహించారు. ఆమె ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. ఆమెపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో.. హనుమకొండ కాకతీయ కాలనీలోని ఆమె ఇంటితో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో తనిఖీలు చేసినట్లు అనిశా వరంగల్‌ రేంజ్‌ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఈ సందర్భంగా గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.2.94 కోట్లు, మార్కెట్‌ విలువ ప్రకారం రూ.10 కోట్లకు పైగా ఉంటుందని వివరించారు.

* హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఉప్ప‌ల్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. మంగ‌ళ‌వారం ఉద‌యం ఓ యువ‌కుడు బైక్‌పై వెళ్తుండ‌గా అది స్కిడ్ అయింది. దీంతో బైక్ వెనుకాల దూసుకొచ్చిన ఆర్టీసీ బ‌స్సు ఆ యువ‌కుడి పైనుంచి దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో యువ‌కుడికి తీవ్ర గాయాలు కావ‌డంతో అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని వ‌ర్షిత్ రెడ్డిగా గుర్తించారు. కొడుకు మృత‌దేహాన్ని చూసి అత‌ని త‌ల్లిదండ్రులు గుండెల‌విసేలా రోదించారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

* ముంబైనుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న భారతీయుడు ట్రాలీ బ్యాగ్‌లో నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్లను తరలిస్తూ గుట్టుగా అధికారుల కన్నుగప్పాలని చేశాడు. కానీ తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు. రూ.2.02 కోట్ల విలువైన 254.71 క్యారెట్ల నేచురల్ లూజ్ డైమండ్, 977.98 క్యారెట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ లభ్యమయ్యాయి. మరో ఘటనలో కొలంబో నుండి ముంబైకి ప్రయాణిస్తున్న ఒక విదేశీ మహిళను తనిఖీ చేయగా ఆమె లోదుస్తుల లోపల దాచిన 24 క్యారెట్ల గోల్డ్ బిస్కట్లు కనుగొన్నారు. వీటి మొత్తం బరువు 321గ్రాములు. మరో వైపు ఫేస్ మాస్క్‌లోనూ డైమండ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి ఇద్దరు, అబుదాబి ఇద్దరు, బహ్రెయిన్ ఇద్దరు, దోహానుఎంచి ఇద్దరు రియాద్ ఇద్దరు మస్కట్ బ్యాంకాక్ ,సింగపూర్ నుంచి ఒక్కొక్కరు చొప్పున 10 మంది అనుమానితులను తనిఖీ చేయగా, రెక్టమ్‌, ఇతర శరీర భాగాల్లో దాచిన రూ.4.04 కోట్ల విలువైన 6.199 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం గా 13 వేర్వేరు కేసుల్లో రూ.6.46 కోట్ల విలువైన అక్రమ రవాణా బంగారం, డైమండ్స్‌,తదితరాలను కస్టమ్స్ అధి​కారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేశారు.

* లిక్కర్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌ విచారణ రేపటికి(ఏప్రిల్‌ 24) వాయిదా పడింది. బుధవారం తిరిగి వాదనలు కొనసాగనున్నాయి. మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) గంటన్నర సేపు వాదనలు వినిపించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z