ScienceAndTech

వైద్య నీట్ లాగా బీటెక్‌కు సరికొత్త పరీక్ష

వైద్య నీట్ లాగా బీటెక్‌కు సరికొత్త పరీక్ష

ఇంజినీరింగ్‌ చదవాలనుకునే విద్యార్థులకు ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది ప్రారంభం నుంచే మానసిక సంఘర్షణ తప్పడం లేదు. బీటెక్‌ సీటు కోసం ఒక్కో విద్యార్థీ కనీసం ఐదారు ప్రవేశ పరీక్షలు రాయాల్సి వస్తోండగా.. వాటికి సన్నద్ధమయ్యేందుకు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఒక్కో సంస్థ ఒక్కో విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అందుకు అనుగుణంగా సిద్ధమయ్యేందుకు రెండో ఏడాదంతా విద్యార్థులు ఒత్తిడిలోనే గడుపుతున్నారు. వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న మాదిరిగా ఇంజినీరింగ్‌కు సైతం జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న డిమాండ్‌ కొన్నేళ్లుగా వినిపిస్తోన్నా, అమల్లోకి రావడం లేదు. బీటెక్‌లో చేరేందుకు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షల దరఖాస్తులకే రూ.10 వేలకుపైగా ఖర్చవుతున్నాయి. రాష్ట్రంలో నాణ్యమైన ఇంజినీరింగ్‌ కళాశాలలు తక్కువ సంఖ్యలో ఉండటంతో వాటిల్లో సీటు సాధించేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. ఒక దాంట్లో సీటు రాకపోతే మరో దాంట్లోనైనా సాధించాలన్న ఒత్తిడి పిల్లలపై ఉంటోంది. ఇంజినీరింగ్‌ విద్యకు సంబంధించి కొంచెం మంచివి అనుకున్న వర్సిటీల్లో ఫీజులు అధికంగా ఉంటున్నాయి. ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు వస్తేనే రాయితీ ఇస్తామంటూ ప్రైవేటు, డీమ్డ్‌ వర్సిటీలు ప్రకటనలు చేస్తుండడంతో విధిగా వాటిని రాయాల్సి వస్తోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z