Devotional

ఉగాది ప్రత్యేకం-పంచాంగం దాని ప్రాధాన్యత

importance of ugadi

ప్రపంచీకరణ పెత్తనంతో తెలుగుతనం విలవిలలాడుతోంది. సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల వినియోగంతో తెలుగు భాష నలిగిపోతోంది. ఇక ఆంగ్లమాధ్యమంతో మన తెలుగు భాష వెలవెలబోతోంది. అయితే ఈ మధ్యకాలంలో తెలుగు భాషను సంస్కరించాలని కొందరైతే, ఉద్ధరించాలని మరి కొందరు చేస్తున్న కృషిలో సాహిత్య పత్రికలు తమ వంతు భాషామ తల్లికి సేవ చేయడం అభినందనీయం.ఇక ఈ తరం వారికి మన తెలుగు దినములు, నెలలు ఇంకా తెలుగు సంవత్సరాల పేర్లు, తిథులూ, నక్షత్రాలు, పండుగలు, పబ్బాలు, పర్వదినాల గురించి అవగాహన లేకపోవడం అందుకు తగిన సమాచారం తెలుసుకోకపోవడం ఒక కారణం.
**ఇటీవల కొన్ని పత్రికలు తెలుగు సంస్కృతిని పరిరక్షించాలని, తెలుగు భాషను నలుగురికీ పంచాలనే ఉద్దేశంతో తెలుగు భాషయందు అభిమానం పెంచుకునే వారికి తగినంత అధ్యయనం చేసుకోవడానికి నిష్ణాతులైన వారి రచనలు ప్రచురించడం హర్షణీయం. తెలుగు ప్రాంతం వారికి ఉపయుక్తంగా ఉండుటకై ‘కాలమానిని’ తిథులు, వారములు, మాసములు, ఆయా మాసాలలో వచ్చు పర్వదిన విశేషాలను సూక్ష్మంలో మోక్షంలా తెలియచేయాలనుకోవడం సత్ సంకల్పమనుకుంటా.కనురెప్పపాటు కాలమును సెకను, 60 సెకనులు, ఒక నిమిషం, 60 నిమిషాలు. ఒక గంట, 12 గంటలు పగలనియు పగలు తరువాత 12 గంటలు రాత్రియనియు. ఒక రోజు అనగా 24 గంటలు, ఏడు రోజులు ఒక వారమనియు, రెండు వారములు ఒక పక్షమనియు, నెలకు రెండు పక్షములు లేదా ముప్పది రోజులనియు. పనె్నండు నెలలు ఒక సంవత్సరమనియు లేదా 365 దినములు. అంటే సంవత్సరమునకు 365 లేదా 366 రోజులు. 3 కాలములు, ఆరు ఋతువులు 24 పక్షములు, 52 వారాలు, పక్షములు రెండు శుక్ల పక్షము 15 రోజులు, తిథులు శుద్ధ పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. దీనిని శుక్ల పక్షము అని అంటారు. ఇక కృష్ణ పక్షము బహుళ పక్షము 15 రోజులు తిథులు బహుళ పాడ్యమి మొదలు బహుళ అమావాస్య. ఆ పిదప ఏడు రోజులయితే వారము.
తెలుగు పేరు సంస్కృతం నామం
1.ఆదివారం భానువారం
2.సోమవారం ఇందువారం
3.మంగళవారం భౌమవారం
4.బుధవారం సౌమ్యవారం
5.గురువారం బృహస్పతి వారం
6.శుక్రవారం మందవారం
7.శనివారం మందవారం
***ఆయా వారాలలో ఆయా గ్రహాధిపత్యం వహిస్తాడు.
రాసులు -12: 1.మేషము 2.వృషభం 3.మిథునం 4.కర్కాటకం 5.సింహము 6.కన్య 7.తుల 8.వృశ్చికం 9.్ధనస్సు 10.మకరం 11.కుంభం 12.మీనం
నక్షత్రాలు -27: అశ్విని, భరణి, కృత్తిక, రోహిణీ, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశే్లష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.
కాలములు: మూడు
వేసవి కాలము: చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసములు
వర్షాకాలము: శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీ మాసాలు
చలికాలము: మార్గశి, పుష్య, మాఘ, ఫాల్గుణ మాసాలు
ప్రతి రెండు నెలలకు ఒక ఋతువు, వసంత, గ్రీష్మ, వర్ష, శరదృతువు, హేమంత, శిశిర ఋతువులు.
ఇక కాలమాన చక్రములు ప్రతి అరవది సంవత్సరములు వరుసగా 1.ప్రభవ 2.విభవ 3.శుక్ల 4.ప్రమోదూత 5.ప్రజాపతి 6.అంగీరస 7.శ్రీముఖ 8.్భవ 9.యువ 10.్ధతు 11.ఈశ్వర 12.బహుధాన్య 13.ప్రమాధి 14.విక్రమ 15.వృష 16.చిత్రభాను 17.స్వభాను 18.తారణ 19.పార్థివ 20.వ్యయ 21.సర్వజిత్ 22.సర్వధారి 23.విరోధి 24.వికృతి 25.కర్ణ 26.నందన 27.విజయ 28.జయ 29.మన్మథ 30.దుర్ముఖీ 31.హేవిళంబి 32.విళంబి 33.వికారి 34.శార్వరి 35.ప్లవ 36.శుభకృత్, 37.శోభకృత్ 38.క్రోధ 39.విశ్వావసు 40.పరాభవ 41.ప్లవంగ 42.కీలక 43.సౌమ్య 44.సాధారణ 45.విరోధికృత 46.పరీధావి 47.ప్రీమాదీచ 48.నంద 49.రాక్షస 50.నల 51.పింగళ 52.కాళయుక్తి 53.సిద్దార్థి 54.రౌద్రి 55.దుర్మతి 56.దుందుభి 57.రుధిరోద్గారి 58.రక్తాక్షి 59.క్రోధన 60.అక్షయ
మన దేశంలో ముఖ్యమైనవి 1.శాలివాహన శకం 2.విక్రమార్క శకము. శాలివాహన శకం దక్షిణ దేశంలోను, విక్రమార్క శకం ఉత్తర దేశం వాడుతున్నప్పటికీ, భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత విజ్ఞులు, శాస్తజ్ఞ్రులు ఒకే జాతీయ శకము యావద్భారతానికి ఉండాలని శాలివాహన శకమును నిర్ణయించారు.
తెలుగు ప్రాంతంలో భార్గవ పంచాంగంతోపాటు గౌరీ పంచాంగమునకు ప్రాధాన్యత ఇస్తుంటారు.
***చైత్రమాసం
తెలుగువారి తొలి పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ. ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం అందరికీ తెలిసినదే. ఇదే మాసంలో మరో పర్వదినం శ్రీరామ నవమి జరుపుకుంటాం. ఇదే రోజున శ్రీరామ జన్మము, సీతారాముల కళ్యాణం, రావణాసురుని వధ, శ్రీరామ పట్ట్భాషేకం. ఇది ప్రతి భారతీయులకు ముఖ్యంగా తమ అభిమాన అందాల రాముని గుణగణాలను కీర్తించుకుంటూ మరువరాని సంతోషకరమైన రోజు. భద్రాచల రాముని కళ్యాణం లోక ప్రసిద్ధి.
***వైశాఖ మాసంలో
శుద్ధ చతుర్దశి నాడు శ్రీ నారసింహ స్వామి జయంతి జరుపుకుంటాం. పిదప వైశాఖ బహుళ దశమి నాడు శ్రీరామ భక్తాగ్రేసరుడైన హనుమ జయంతిని జరుపుకుంటాం.
శ్రావణ మాసంలో: ఈ మాసము మహిళలకు ఎంతో ప్రత్యేకమైన మాసం. మంగళగౌరి నోములు, లక్ష్మి వ్రతాలు, ఇంకను ద్వాపర యుగంలో రోహిణీ నక్షత్రయుక్త శ్రావణ బహుళ అష్టమినాడు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణునిగా జన్మించాడు. కావున శ్రీకృష్ణాష్టమి, ఉట్ల పండుగను జరుపుకుంటాం.
***భాద్రపద మాసంలో
భారతీయుల తొలి పండుగ వినాయక చవితి వస్తుంది. ఈ పండుగ తరువాత మిగతా పండుగలు వస్తాయి కనుక తొలి పండుగ, గణేష నవరాత్రి ఉత్సవాలను భాద్రపద శుక్ల చవితి రోజున ఆరంభించి నవరాత్రుల తదనంతర శోభాయాత్రలో ఘనంగా జరిపి భక్తిశ్రద్ధలతో జలంలో నిమజ్జనం చేస్తాం. మహారాష్టల్రో ముంబాయి పట్టణం ప్రసిద్ధి కెక్కినది.బహుళ తదియ నాడు వచ్చే పండుగ ఉండ్రాళ్ల తద్దెయనియు ఆశ్వీయుజ బహుళ తదియ నాడు వచ్చే పండుగను అట్ల తద్దె అంటారు. ఈ రెండు పండుగలు గౌరమ్మకు ప్రీతికరమైనవి.
***ఆశ్వీయుజ మాసంలో
శుద్ధ పాడ్యమిలో దేవీ నవరాత్రుల కలశ స్థాపన జరుగుతుంది. దీనిని శరన్నవరాత్రులు లేదా దసరా నవరాత్రులు ఇంకను అత్యంత వైభవం బతుకమ్మ పండుగ సంబరాలు కూడా జరుపుకుంటారు. యావద్భారతంలో ముఖ్యంగా మైసూర్ దసరా వేడుకలు చూసి తీరవలసిందే. ఆయుధ పూజ శమిపూజ ‘బంగారం’ జమ్మి ఆకు మిత్రులకు స్నేహితులకు హితులకు సన్నిహితులకు ఇచ్చి పుచ్చుకోవడంలో ఆనందపడతారు. ఇదే నెలలో వచ్చే అట్లతద్దె, ఉండ్రాళ తద్దె లేదా ఉయ్యాల పండుగ అని గోరింటాకు పండుగ అంటారు.
ఆశ్వీయుజ బహుళ చతుర్దశి అమావాస్య నాడు వస్తుంది. ఇది రెండు రోజుల పండుగ. త్రయోదశినాటి రాత్రి ‘అపమృత్యు’ నివారణ కోసం ప్రమిదలలో నువ్వుల నూనె గానీ, ఆముదంతో గానీ దీపాలు వెలిగించి ఇంటి ముందుంచాలి. నరక చతుర్దశి రోజున సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం తలకు నూనె రాసుకొని తలస్నానం చేయాలి. మంగళ హారతులు పట్టించుకొని, ఆడపడుచులకు హారతి పళ్లెంలో డబ్బులు వేయాలి. ఇది కూడా స్ర్తిల పండుగే. సత్యభామ నరకాసురునిపై జయించిన కారణంగా విజయ మంగళ హారతులతో టపాసులు, చిచ్చుబుడ్లు, సీమ టపాకాయలతో పండుగ సంబరం జరుపుకొని లక్ష్మిపూజ చేయడం కొత్త ఖాతాపద్దు పుస్తకాలు తెరవడం మార్వాడీ, ఇతర వ్యాపారస్థులకు వస్తున్న సదాచారం నేటికీ కొనసాగుతూనే ఉంది.
***కార్తీకమాస విశిష్టత
కార్తీక దీపారంభం, నాగుల చవితి, నాగుల పంచమి, మతత్రయ ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణం, 33 పున్నముల నోము, సుబ్రహ్మణ్య షష్ఠి ఇత్యాదులు.
***మార్గశిర మాసం
అన్ని మాసములకన్న తలమానికం వంటిది. మార్గశిరీష మాసమంటారు. శ్రీదత్త జయంతి, కోరల పూర్ణిమ పిదప ధనుసంక్రమణంతో ధనుర్మాస మాసారంభం గోదాదేవి రచించిన పాశురములు దీనినే తిరుప్పావై అంటారు. వైష్ణావాలయాల్లో వేకువ జామునే లేచి ఆడ మగ కలిసి తిరుప్పావై ముక్తకంఠంతో రాగయుక్తంగా ఆలపించిన పిదప కట్టెపొంగలి, దద్ద్యోజనం ప్రసార వినియోగాలు జరుగుతాయి. ఇంకను రథసప్తమి రంగవల్లులు వేస్తారు.
***పుష్యమాసంలో
పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. దీనినే వైకుంఠ ఏకాదశి రోజు అంటారు. ఈ రోజు శ్రీవిష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టే తన భక్తుల కోసం ప్రత్యేకంగా ఉత్తరద్వారం తెరిపించుకొని గరుడాళ్వారు వాహనం కాగా గోదా (ఆండాళు) సంయుక్తంగా దర్శనమిస్తారు. కాబట్టి భక్తులు సూర్యోదయ పూర్వమే లేచి స్నాన సంధ్యావందానిదులు కార్యక్రమములు ముగించుకొని ఉత్తరద్వార ఆలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటే ఆ పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది గాఢ విశ్వాసం. వివేకానంద జయంతి, తదుపరి భోగి, గోదా కళ్యాణం మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం, కనుమ, ముక్కనుము, బొమ్మల కొలువు. ఆ తరువాత వాగ్గేయకారుడైన త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం జరుగుతాయి.
***మాఘమాసంలో
మాఘమాసంలో వచ్చే పర్వదినాలు శ్రీపంచమి, సూర్యజయంతి, ధనిష్ఠకార్తె ప్రవేశం, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, సమ్మక్క సారలమ్మ జాతర, కుంభసంక్రమణం, మహామాఘ మాస పూర్ణిమ స్నానాలు, రామకృష్ణ పరమహంస జయంతి ఈ మాసంలో బహుళపక్ష చతుర్దశి నాడు దీనినే కృష్ణ చతుర్దశి లేదా మహాశివరాత్రిగా శాస్తజ్ఞ్రులు నిర్ణయించినందున శైవ సంప్రదాయం ప్రకారం వేకువజామున లేచి తలస్నానం చేసి పూజా పునస్కారాలు చేసుకొనిన పిదప శివాలయానికి వెల్లి మారేడు దళాలతో శివార్చన, అభిషేకం చేయించి శివకల్యాణం, లింగోద్భవం కనులారగాంచి మొత్తం రాత్రంతా జాగరణం చేసి ఏమీ తినకుండా ఉపవాస దీక్షతో శివపురాణం విన్నచో శివానుగ్రహం కలిగి కైలాస ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు శివపురాణం వక్కాణిస్తున్నాయి.
***ఫాల్గుణ మాసం
ఈ సంవత్సరంలోని చివరి మాసం. ఈ మాసంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, హోళి పండుగ, వసంతోత్సవం, మతత్రయ ఏకాదశి దీనినే పాప విమోచన ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించిన వారికి ఈ సంవత్సరంలో చేసిన పాపాలు పోతాయని నమ్మకం. చివరిది సర్వ అమావాస్యతో దుర్ముఖి నామ సంవత్సరానికి వీడ్కోలు.

#######################

ఉగాది తెలుగువారందరికీ పెద్ద పండుగ. వసంత ఋతువు ఆనాడే ఆరంభం అవుతుంది. పచ్చని బయళ్ళు, నిర్మలమైన ఆకాశం, ఫలపుష్పాదులతో ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోకిల కుహుకుహూ గానాలు, పక్షుల కిలకిలారావాలు ప్రకృతి శోభను ద్విగుణీకృతం చేస్తాయి. కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తాయి. పండుగ రోజున ప్రతి ఇల్లూ మంగళ తోరణాలతో, ముంగిట ముగ్గులతో అందాలకే అందం అద్దినట్టు ముస్తాబవుతుంది.
*భారతీయుల పండుగలకు ఖగోళ, జ్యోతిష శాస్త్ర, విజ్ఞాన ప్రమాణాలతో కూడిన హేతుబద్ధమైన నేపథ్యం ఉంటుంది. ఆ పండుగల్లో సంస్కృతీ సంప్రదాయాలు వెల్లివిరుస్తాయి. అలాంటి వాటిలో చాంద్రమానాన్ని అనుసరించి తెలుగువారు, కన్నడిగులు, మహరాష్ట్రీయులు జరుపుకొనే ఉగాది పండుగ ఎంతో ప్రాశస్త్యం పొందింది. ఉగాది పండుగ ఖగోళ శాస్త్ర గణన మీద ఆధారపడింది. అనంతమైన కాలాన్ని ఖగోళ శాస్త్రానుసారం లెక్కించి, భూమి సూర్యుడి చుట్టూ ఒక ఆవృతం పూర్తి చేసిన కాలాన్ని సంవత్సరంగా ప్రమాణీకరించారు. అనంత విశ్వాన్ని అంతరిక్షంగా, అందులో ఉన్న గ్రహ, నక్షత్రాల గమనాన్ని పరిశీలించి, పరిశోధించి కాల నిర్ణయం చేసేదే ఖగోళ శాస్త్రం. అలా ఏర్పడినవే నిమిషాలు, గంటలు, రోజులు, మాసాలు, ఋతువులు, అయనాలు-ఒక సంవత్సర కాలంలో వీటిని గమనించవచ్చు.
*సృష్టి మొదలైన రోజు!
ఈ కాలగమనం మీద మానవుడి జీవితం ఆధారపడి ఉంది. పూర్వీకులు ఈ కాలగణనాన్ని వసంత ఋతువు మొదలయ్యే చైత్రమాస పాడ్యమితో ప్రారంభించారు. దీనికి కారణం సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ రోజే సృష్టిని ఆరంభించడమేనని వివిధ గ్రంథాలు వెల్లడిస్తున్నాయి.
‘చైత్ర మాసి జగద్బ్రహ్మ సవర్ణపథమే అహని/ శుక్ల పక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి’ అని ‘నిర్ణయ సింధువు’ పేర్కొంటోంది.
‘చైత్ర శుక్ల సమారంభే జగతాం జగదీశ్వరః
సర్వం చక్రే తదారాజన్‌! తతన్నస్మిన్‌ సదా దినే’
ఆ రోజునే బ్రహ్మ సృష్టిని పూర్తి చేశాడని ‘ధర్మసింధువు’ చెబుతోంది. ఏది ఏమైనా చైత్ర శుద్ధ పాడ్యమినాడే సృష్టి జరిగిందన్నది నిర్వివాదమైన అంశమని శాస్త్రోక్తి. అదే ‘యుగాది’. ఆధునిక పరిభాషలో ‘ఉగాది’గా మార్పు చెందింది. ‘యుగం’అంటే రెండిటి కలయిక. కాలగణనలో రోజును రాత్రి, పగలు అని రెండుగా విభజించడం జరిగింది యుగాది నాడే! మరొక నిర్వచనం ప్రకారం ‘ఉగం’ అంటే నక్షత్ర గమనం. ‘ఉగస్య ఆదిః ఉగాది’అని వ్యుత్పత్తి. రెండూ అంగీకారయోగ్యమైనవే.
**ఉగాది రోజున ఏం చేయాలంటే…
ఈ పండుగ రోజున అనుష్ఠించవలసిన విధివిధానాలను మన ఋషులు నిర్ణయించి, మార్గదర్శనం చేశారు. అవి ప్రధానంగా మూడు: బ్రాహ్మీ ముహూర్తాన అభ్యంగన స్నానం, ఉగాది పచ్చడి సేవనం, పంచాంగ శ్రవణం.
**అభ్యంగన స్నానం
ప్రాతఃకాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఆ సమయంలోనే స్నానం చేయాలి. ఇంట్లో పెద్దవారితో తలపై నువ్వులనూనె పెట్టించుకొని, ఆశీస్సులు పొందాలి. ఆ తరువాత నలుగు పెట్టుకొని, శరీరాన్ని శుభ్రపరచుకోవాలి. అలా చెయ్యడం వల్ల అలక్ష్మి తొలగిపోతుంది.
‘జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిం
అసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహమ్‌’ అనే మంత్రం ఈ స్నానానికి వర్తిస్తుంది. అంటే గృహంలోని జ్యేష్ఠాదేవి స్వరూపాలన్నీ తొలగి, లక్ష్మీ స్వరూపాలైన పుత్ర, మిత్ర పరివారంతో, సంపత్తితో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకోవడం! శుచి, శుభ్రత ఉన్న చోటే లక్ష్మీ నివాసం! స్నానం అనంతరం కొత్త వస్త్రాలు ధరించాలి.
**ఉగాది పచ్చడి
ఇది ఉగాది నాటి ప్రత్యేక విధి. పచ్చడి ఎలా తయారు చెయ్యాలో శాస్త్రమే సూచించింది.
‘యద్వర్షాదౌ నింబ సుమం శర్మరామ్ల ఘృతై ర్యుతం
పశ్యతు పూర్వయా మేశ్యా తద్వర్షం సౌఖ్యదాయకం’ అని శాస్త్రోక్తి. ఆయుర్వేద శాస్త్రం కూడా ఉగాది పచ్చడికి ప్రాముఖ్యాన్ని ఇచ్చింది.ఉగాది పచ్చడిలో ప్రధానంగా వేప పూత ఉండాలి. వేప రోగనిరోధక శక్తి కలిగినది.
రెండోది బెల్లం. ఇది మంగళకరమైన ద్రవ్యం. ఎంతకాలం నిల్వ ఉన్నా ‘పాత’ అనే మాట లేదు ఎప్పుడూ కొత్తదే. అందుకే భగవంతుడికి నివేదించే పదార్థాలలో బెల్లాన్ని విధిగా ఉపయోగిస్తారు.మూడోది కొత్త చింతపండు. దీన్ని ‘సహస్ర వేధి’ అంటారు. ఎలాంటి రోగాన్నయినా నివారించగల శక్తి చింతపండుకు ఉంది.
నాలుగోది జీలకర్ర. జీర్ణ ప్రక్రియకు దోహదం చేస్తుంది.అయిదోది లవణం. ఉప్పు లేని పదార్థం అంటూ ఉండదు. ఇది వాతరోగాలను హరిస్తుంది.
ఇక భగవంతుడికి ప్రీతిపాత్రమైన వృక్షం మామిడి. మంగళకరమైన కార్యాలన్నీ మామిడి వృక్షానికి సంబంధించిన వస్తువులతోనే ఆరంభమవుతాయి. ఉగాది పచ్చడిలో వసంత ఋతువులో ఫలించిన మామిడికాయ ముక్కలను కలుపుతారు. దీనిలో ఔషధశక్తి విస్తారంగా ఉంటుంది. సుఖప్రసవాన్ని కాంక్షిసూ గర్భిణులు పుల్ల మామిడి తినడం అందరికీ తెలిసినదే.
ఇవి కాకుండా స్వచ్ఛమైన ఆవునెయ్యి, తేనె, జలం కూడా కలుపుతారు. అవి అమృతతుల్యమై, ఉగాది పచ్చడిని అమృతప్రాయం చేస్తాయి.ముందుగా తమ ఇలవేల్పును భక్తిశ్రద్ధలతో పూజించి, షడ్రుచుల మిశ్రమమైన ఉగాది పచ్చడిని నివేదించి, ఉషోదయం కాకుండా పరగడుపునే సేవించాలి. అలా సేవిస్తే ఆ పచ్చడి ప్రభావం ఆ వ్యక్తి జీవితం మీద సంవత్సర కాలం ఉంటుందని పెద్దల మాట. ఉగాది పచ్చడిలో నిబిడీకృతమై ఉన్న ఆయుర్వేదశాస్త్ర రహస్యం ఇది. అనంతరం పెద్దలనూ, గురువులనూ దర్శించి, వారి దీవెనలు పొందాలి.
**పంచాంగ శ్రవణం
ఉగాది నాటి ముఖ్య విధుల్లో పంచాంగ శ్రవణం ఒకటి. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంగాలతో కూడినది పంచాంగం. ఒక సంవత్సర కాలాన్ని ప్రమాణంగా తీసుకొని, ఆ సంవత్సరంలో గ్రహాల సంచారాన్ని పరిశీలించి, ప్రతి వ్యక్తికీ ఫలితాలను పంచాంగం వెల్లడిస్తుంది. ఆయా నక్షత్ర జాతకులు ఆ సంవత్సరంలో పొందబోయే శుభాశుభ ఫలితాలు, ఆదాయ వ్యయాలు, కందాయ ఫలాలను పంచాంగకర్తలు సవివరంగా తెలియజేస్తారు. తిథి సంపదనూ, వారం ఆయుష్షునూ, నక్షత్రం పాపాన్నీ, యోగం రుగ్మతనూ, కరణం కార్యసిద్ధినీ తెలియజేస్తాయి. ఇవన్నీ గ్రహాల సంచారాన్ని బట్టి ఉంటాయి. పరమాత్మ అధీనంలోనే గ్రహ సంచారం జరుగుతుంది. కాబట్టి పంచాంగం ద్వారా ఫలితాలను తెలుసుకొని, ఉపద్రవాలు ఎదురయ్యే సమయంలో దాని నుంచి ఉద్ధరించే శక్తి ఉన్న పరమేశ్వరుణ్ణి ఆశ్రయించడమే కర్తవ్యం!