Movies

జస్ట్ మిస్

actress radhika missed srilankan bombings by fate

శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్ల ఘటన నుంచి సినీ నటి రాధికా శరత్‌కుమార్‌ తృటిలో తప్పించుకున్నారు. రాజధాని కొలంబోలో వరుసగా పేలుళ్లు జరిగాయి. అయితే పని నిమిత్తం శ్రీలంక వెళ్లిన రాధిక ఈరోజు ఉదయం సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్‌లో బస చేశారు. ఆమె పని ముగించుకుని హోటల్‌ నుంచి బయటికి వెళ్లిన కొద్దిసేపటికే పేలుడు సంభవించింది. ఈ విషయాన్ని రాధిక ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఓ మై గాడ్‌. కొలంబోలోని సిన్నామన్‌ హోటల్‌ నుంచి నేను బయటికి వచ్చిన కొద్దిసేపటికే పేలుడు సంభవించింది. నేను నమ్మలేకపోతున్నాను’ అని రాధిక తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 166 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. 400 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. మొత్తం ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు పోలీసులు తెలిపారు.