Politics

స్టే అయిపోయింది. ఇక కోర్టులో తలపడనున్న చంద్రబాబు-లక్ష్మీపార్వతి!

lakshmi parvathi and chandrababu to meet in the court as chandrababus stay has been cancelled

చంద్రబాబునాయుడిపై నందమూరి లక్ష్మీ పార్వతి వేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ కోర్టు విచారణ మే 13 నుంచి ప్రారంభం కానుంది. 2005లో లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టును ఆశ్రయించగా, అప్పట్లో హైకోర్టు నుంచి చంద్రబాబు స్టే తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దీర్ఘకాలంగా ఉన్న స్టేలను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో, ఈ స్టే రద్దుకాగా, కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కావాలని లక్ష్మీ పార్వతికి సమన్లు అందాయి. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆమె ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణను ప్రారంభించిన కోర్టు, కేసు స్టేటస్ పై మే 13న విచారిస్తామని స్పష్టం చేస్తూ, వాయిదా వేసింది.