NRI-NRT

న్యూజెర్సీలో శ్రీలంక బాధితులకు నివాళి

saidatta peetham new jersey offers tribute to bomb blast victims in srilanka

ఈస్టర్‌ పర్వదినాన శ్రీలంకలో ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం నివాళులు అర్పించింది. పీఠం సభ్యులు వీరికి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని బాబాని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమీషనర్ ఉపేంద్ర చివుకుల, దత్త పీఠం పాలక వర్గ సభ్యులు మధు అన్న, దాము గేదెల, సీమ జగిత్యాని, సాయి దత్త పీఠం గురుకుల నిర్వాహకురాలు రాణి ఊటుకూరు, శ్రీలంకకు చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు విజ్జి కొట్హఛ్చి తదితరులు పాల్గొని కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు.