Politics

మమతాజీ…మీవాళ్లు 40మంది నాతో టచ్‌లో ఉన్నారు

modi says 40trinamool candidates are in touch with him

బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి.. ప్ర‌ధాని మోదీ జ‌ల‌క్ ఇచ్చారు. తృణ‌మూల్ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు త‌న‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని మోదీ తెలిపారు. ఇవాళ పశ్చిమ బెంగాల్‌లోని సీరంపోర్‌లో జ‌రిగిన బ‌హిరంగ‌స‌భ‌లో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. మే 23వ తేదీన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని, అప్పుడు అంత‌టా క‌మ‌లం విక‌సిస్తుంద‌ని, అప్పుడు తృణ‌మూల్‌ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతార‌ని మోదీ అన్నారు. త‌న‌తో ఇప్పుడు కూడా 40 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ని దీదీకి జ‌ల‌క్ ఇచ్చారు. బెంగాల్ ప్ర‌జ‌ల‌ను దీదీ మోసం చేశార‌ని, ఇక ఇప్పుడు మ‌మ‌తా ఎన్నిక‌ల్లో నెగ్గ‌లేద‌న్నారు.