Politics

భర్త కన్నా నా నామస్మరణ ఎక్కువైంది

Smriti Says Priyanka Chanting Her Name More Than Her Husband

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్‌ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మీద విరుచుకుపడ్డారు. సోమవారం దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాల్లో ఐదో దశ పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఓ వార్తా ఎజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం..‘ఐదు సంవత్సరాల క్రితం ఆమెకు నా పేరు కూడా తెలీదు. కానీ ఇప్పుడు ప్రతిసారి నా పేరే తలుస్తున్నారు. అది నాకు గొప్ప గౌరవం. ప్రస్తుతం ఆమె తన భర్త పేరు కంటే నా పేరే ఎక్కువ సార్లు తలుస్తున్నారు’ అని కేంద్రమంత్రి ప్రియాంక మీద విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ కంచుకోట అయిన అమేఠీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ మధ్య జరుగుతున్న ఎన్నికల పోరు చాలా ఆసక్తిదాయకంగా మారింది. 2014లో ఇదే స్థానంలో వీరిద్దరు పోటీపడగా, స్మృతికి పరాజయం ఎదురైంది. ఈసారి వీరి మధ్య పోరు తీవ్రంగా ఉండటంతో ఎస్పీ-బీఎస్పీ కూటమి తరఫున అభ్యర్థిని బరిలోకి దించలేదు.