WorldWonders

వికారాబాద్‌లో 169నాణేల గుప్తనిధులు

Antique Treasure Discovered In Vikarabad Telangana India

జిల్లాలోని ధారూర్‌ మండలం ఏబ్బనూర్‌ గ్రామంలోని గుప్తనిధులు బయటపడటం కలకలం రేపింది. కొందరు వ్యక్తులకు గుంత తవ్వే సమయంలో భారీగా వెండి నాణేలు లభించాయి. అయితే దీనిపై సమచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని 169 నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ఇద్దరని పోలీసులు అరెస్ట్‌ చేయగా.. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. స్వాధీనం చేసుకున్న నాణేలను పోలీసులు సీజ్‌ చేశారు.