Devotional

రేపటి నుండి కార్తీకమాసం. నియమాలు ఇవి.

Rules And Information On Kartheeka Masam 2019

ది” 29-10-2019 మంగళవారం నుండి ,,

ది” 26-11-2019 మంగళవారం వరకు ,,

కార్తీక మాసము అయినది…

మొత్తం 4 సోమవారాలు

29 వ తేదీ మంగళవారం ,, భగినీ హస్త భోజనం

31 వ తేదీ గురువారం ,, నాగుల చవితి

4 వ తేదీ మొదటి సోమవారం

8 వ తేదీ శుక్రవారం ,, మొదటి ఏకాదశీ

9 వ తేదీ శనివారం ,, క్షీరాబ్ది ద్వాదశి ,, తులసి/ఉసిరి మొక్కకు పూజ

11 వ తేదీ రెండవ సోమవారం

12 వ తేదీ మంగళవారం ,, పౌర్ణమి జ్వాలాతోరణం

18 వ తేదీ మూడవ సోమవారం

22 వ తేదీ శుక్రవారం ,, రెండవ ఏకాదశి

25 వ తేదీ నాలుగవ సోమవారం

26 వ తేదీ మంగళవారం ,, అమావాస్య

27 వ తేదీ బుధవారం ,, పాడ్యమి దీపాలు//పోలిస్వర్గం

కార్తీకంలో దీపారాధనలకి ఈ క్రింది రకాల వత్తులనుఉపయోగించుట ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చును

ఆదివారం – పారాణి లో తడిపి ఆరబెట్టిన వత్తులు

సోమవారం – అరటి దూట తో నేసిన వత్తులు (నూనెలో బాగా నానపెడితే చక్కగా వెలుగుతాయి)

మంగళవారం – కుంకుమ నీళ్ళ లో తడిపి ఆరబెట్టిన వత్తులు

బుధవారం – పసుపు, గంధం, పన్నీరు కలిపిన నీళ్ళ లో తడిపి ఆరబెట్టిన వత్తులు

గురువారం – కొబ్బరి నీళ్ళ లో తడిపి ఆరబెట్టిన వత్తులు

శుక్రవారం – పసుపు నీళ్ళ లో తడిపి ఆరబెట్టిన వత్తులు

శనివారం – తామర తూడు తో నేసిన వత్తులు (నూనెలో బాగా నానపెడితే చక్కగా వెలుగుతాయి)

అవకాశం ఉన్నవారు పై విధంగా దీపారాధన ప్రక్రియను ప్రయత్నించగలరు.

కార్తీకమాసం లో చేయకూడనిపనులు.

ఇంగువ,వుల్లిపాయ,వెల్లుల్లి,ముల్లంగిదుంప,గుమ్మడికాయ,శనగపప్పు,పెసరపప్పు,నువ్వులు కార్తీకమాసంలో తినటం నిషేధం

కంచుపాత్ర్తలో భోజన౦,ఆదివారంకోబ్బరికాయ,ఉసిరికాయ తినరాదు.భోజన సమయంలో మౌనంగావుండాలి .
మాసపురాణ౦ వినాలి

కార్తీక స్నాన మంత్రము :-

కార్తీకేహం కరిష్యామి ప్రాతః స్నానం జనార్దన!
ప్రీత్యర్ధం తన దేవేశ దామోదర మయా సహ!!

కార్తీకమాసం

కార్తీకముతో సమానమైన మాసము లేదు. విష్ణు దేవునితో సమానమయిన దేవుడు లేడు. గంగతో సమానమగు తీర్థము లేదు అని చెప్పబడినది.
తెల్లవారుజామునే నిద్రలేవడం, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లలో స్నానం చేయడం, బోళాశంకరునికి నిత్యమూ రుద్రాభిషేకం చేయడం, నుదుట విభూతిని మెడలో రుద్రాక్షల్నీ- లేదా- తులసి పూసల్ని ధరించండం రోజుకి ఒక పూట మాత్రమే భుజించడం, ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయడం…ఒకటేమిటి? ఇలా ఎన్నెన్నో సంప్రదాయాలని మూటగట్టుకుని తెచ్చింది పవిత్రమైన కార్తీకమాసం.
ఈ కార్తీక మాసంలో చేసే వ్రతములలో ముఖ్యమైనవి కార్తీకస్నానం, ఉపవాసము, కార్తీకదీపము.
కార్తీకస్నానం :
కార్తీక మాసమంతా తెల్లవారుజామున లేచి కృత్తికా నక్షత్రం అస్తమించేలోగానే నదులలో గాని తటాకాలలో గాని అలాంటివి అందుబాటులేనప్పుడు ఇంట్లోని స్నానాల గదిలో అయినాసరే, తలస్నానం చేయాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది.
ఈ విధంగా నియమంతో స్నానం చేసి శివుడినిగాని, విష్ణవునుగాని, లేదా మరే దైవాన్నైనా సరే ధ్యానించడం వలన, అర్ఘ్యాదులు ఇవ్వడం వలన కురుక్షేత్రం, గంగానది, పుష్కరతీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సర్వపాపాలు నశించి పుణ్యఫలితాలు అందుతాయి.
కార్తీకమాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలనేది ఒక నియమం. దీనినే ‘నక్తమ్’ అంటారు. పగలంతా నిరాహారంగా ఉండలేనివారు పాలవంటి ద్రవపదార్థాన్ని గాని, పండువంటి ఘనపదార్థాన్ని గాని స్వీకరిస్తూ రాత్రివేళ చంద్ర దర్శనం చేసుకుని, దీపారాధన చేసుకుని భోజనం చేయాలి.
దీపారాధన :
కార్తీకమాసంలో దీపారాధన చేయడం మహామహిమోపేతమైనది. శివాలయంలోగాని, ఇంట్లోనైనా సరే ప్రాతఃకాలం, సాయంకాలం దీపారాధన చేయడం దైవానుగ్రహం లభ్యమయ్యే విధానం. ఎవరైనా సరే, తెలిసిగాని, తెలియకగాని, ఎక్కడైనా సరే కార్తీకమాసంలో దీపం పెడితే చాలు వారి సర్వవిధ పాపాలు హరింపవేస్తుంది. జ్ఞానం, మోక్షం, ఇహమున శ్రేయస్సు, శుభఫలితాలు కలుగుతాయి.
కార్తీకదీప దానంవల్ల నరకప్రాప్తి నివారణ కలుగుతుంది. ఈ మాసములో దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదము.
దీపం దానమిచ్చుట, బంగారము, నవధాన్యములు గాని, అన్నదానముగాని, శయ్య (మంచం) దానమిచ్చుట వలన స్త్రీలకు ఐదోతనము వృద్ధియగుటేగాక, మంగళప్రదము సౌభాగ్యకరముగా చెప్పబడినది.
సూర్యాస్తమయం అయిన వేంటనే సంధ్యాదీపం వెలిగించుట ముగ్గుపెట్టి ఇంటిముందు దీపం పెట్టుట, తులసి కోటలో దీపము పెట్టుట, తులసి పూజ, గౌరీపూజ చేయుట వలన ఆర్థిక బాధలు తొలగును.
కార్తీకమాసములో కొన్ని వస్తువులు నిషేధించడమైనది. అవి వాడరాదు.

ఇంగువ, పెద్ద ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి దుంప, గుమ్మడి కాయ, తీయగుమ్మడి, నువ్వులు నిషిద్ధముగా చెప్పబడినవి. ఈ మాసమున మాంసాహారం భుజించుట నిషిద్ధము. పగటి పూట ఆవుపేడతో అలికి, పద్మములతో ముగ్గులు పెట్టి, రంగు రంగుల రంగవల్లిపై కార్తీకదీపం పెట్టి, కార్తీక పురాణము చదివిన వారికి, వినిన వారికి ఏడు జన్మలవరకూ వైధవ్యం కలగదని కార్తీక పురాణము చెపుతున్నది.

ధాత్రీపూజ :
ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది. కార్తీకమాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి, మధుర పదార్థాలను నివేదించాలి.