NRI-NRT

డా.ప్రియాంకాకు డాలస్ ప్రవాసుల నివాళి

DFW Metro Telugu NRIs Pay Respect To Dr.Priyanka Reddy - #JusticeForDisha-డా.ప్రియాంకాకు డాలస్ ప్రవాసుల నివాళి

ఇటీవల శంషాబాద్‌లో దారుణంగా హత్య చేయబడిన వెటర్నరీ వైద్యురాలు డా.ప్రియాంకా రెడ్డికి డాలస్ ప్రవాసులు ఆదివారం నాడు కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ప్రియాంకా కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పాఠశాల పాఠ్యాంశాల్లో పోలీసు, వైద్య, అత్యవసర విభాగాలను ఎలా సంప్రదించాలనే అంశాలపై బోధన జరపాలని కోరారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో డా. ప్రసాద్ తోటకూర, అజయ్ రెడ్డి, శ్రీధర్ కొరసపాటి,రావ్ కలవల, గోపాల్ పొన్నంగి,జానకి మందాడి, రఘువీర్ బండారు, పవన్ గంగాధర , చిన్న సత్యం వీర్నపు ,శ్రీకాంత్ పోలవరపు,చంద్ర పోలీస్,శారద సింగిరెడ్డి,మాధవి సుంకిరెడ్డి,ఇంద్రాణి పంచార్పుల,మాధవి లోకిరెడ్డి, అనురాధ మేకల,సుధాకర్ కలసాని, రవికాంత్ రెడ్డి మామిడి , రామ్ అన్నాడి,,అశోక్ కొండల,వేణు భాగ్యనగర్, నరేష్ సుంకిరెడ్డి, జయ తెలకపల్లి, మధుమతి వ్యాసరాజు, దీప్తి సూర్యదేవర, లింగా రెడ్డి అల్వా, డా. ప్రియాంక బంధువులు అభినవ్ రెడ్డి , సింధూరి తదితరులు పాల్గొన్నారు.