Politics

టాటా చెప్పిన ఉత్తమ్

Uttam Kumar Reddy Bids Farwell To PCC Position

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొద్దిరోజుల్లో పీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నట్లు ఆయన ప్రకటించారు. హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ కార్యాలయంలో మున్సిపల్‌ ఎన్నికలపై కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీసీసీ బాధ్యతలతో సొంత నియోజకవర్గానికి సమయం కేటాయించలేకపోతున్నానని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఆ తర్వాత నుంచి హుజూర్‌నగర్‌, కోదాడ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.