ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ మల్హోత్రాపై టీమ్ఇండియా మాజీ సారథి సునీల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గతనెల ఓ జాతీయ పత్రికతో మాట్లాడిన అశోక్ ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్ఇండియా ఆటగాళ్లు, ఫస్ట్క్లాస్ క్రికెటర్లు తమ జీతాల్లో కోత విధించుకునేలా ఆలోచించాలని కోరాడు. ‘ఆటగాళ్ల జీతాలు తగ్గించడం సరికాదని నాకూ తెలుసు, కానీ బీసీసీఐకి గతంలో మాదిరిగా ఆదాయం రావట్లేదు. కాబట్టి.. ఇప్పుడు క్రికెటర్లు తమ జీతాల్లో కోత విధించుకోవాలి’ అని ఇండియన్ క్రికెటర్స్ ప్రెసిడెంట్ అన్నారు. దీనిపై స్పందించిన సునీల్ గావస్కర్.. ‘మల్హోత్రా బీసీసీఐకి మంచిచేశాలా ప్రయత్నిస్తున్నాడని అర్థమవుతోంది. అయితే, ఆటగాళ్ల జీతాల్లో కోత విధింపులపై మాట్లాడటానికి అతనికి ఎవరు అధికారమిచ్చారనేదే అసలైన ప్రశ్న. ప్రస్తుత టీమ్ఇండియా ఆటగాళ్లు, ఫస్ట్క్లాస్ క్రికెటర్లు.. ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్లో సభ్యులు కాదు. అలాంటప్పుడు వాళ్ల తరఫున ఈయన మాట్లాడకూడదు. తమ జేబుకు చిల్లు పడనంత కాలం ఇతరుల జీతాల కత్తిరింపులపై మాట్లాడటం చాలా తేలిక’ అని గావస్కర్ ఓ మీడియాకు రాసిన వార్తలో పేర్కొన్నారు.
నీకెందుకు సన్నీ?
Related tags :