Health

Flash: తెలంగాణాలో నేడు 71 కరోనా పాజిటివ్ కేసులు

Telangana Witnesses 71 Corona Positive Cases In One Day

రాష్ట్రంలో మరో 71 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కరోనాతో ఒకరు చనిపోయారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 38, రంగారెడ్డిలో ఏడుగురికి, మేడ్చల్​లో ఆరుగురికి, సూర్యాపేట, వికారాబాద్​, నల్గొండ, నారాయణపేట జిల్లాల నుంచి ఒక్కొక్కరి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల్లో 12 మంది, విదేశాల నుంచి వచ్చిన నాలుగురికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 1,991కి చేరాయి. ఆస్పత్రిలో చికిత్స నుంచి కోలుకుని 120 మంది డిశ్ఛార్జి కావడంతో ఈ సంఖ్య 1,284గా నమోదైంది. మరో 650 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 57కి చేరింది.