WorldWonders

గిర్ అడవుల్లో పెరిగిన సింహాల సంఖ్య

గిర్ అడవుల్లో పెరిగిన సింహాల సంఖ్య

గుజరాత్ లోని గిర్ ఫారెస్ట్ లో సింహాల సంఖ్య 29 శాతం పెరిగింది. ఐదేళ్ల కిందట 523 సింహాలు ఉండగా , ఆ సంఖ్య ఇప్పుడు 674 కు చేరింది. దీనిపై ప్రధాని మోడీ హ్యాపీ ఫీలయ్యారు. రెండు శుభవార్తలంటూ ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు. ” గిర్ ఫారెస్ట్ లో సింహాల సంఖ్య 29 శాతం పెరిగింది. భౌగోళికంగా వాటి డిస్ట్రిబ్యూషన్ ఏరియా కూడా 36 శాతం పెరిగింది. ఈ అద్భుతానికి కారణమైన వారందరికీ గుజరాత్ ప్రజలకు జేజేలు ” అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. గిర్ ఫారెస్ట్ లో ఉన్న సింహాల నాలుగు ఫోటోలను కూడా ప్రధాని మోడీ షేర్ చేశారు.