Health

కోవిద్ నుండి కోలుకున్నాక గుండెపోటు

కోవిద్ నుండి కోలుకున్నాక గుండెపోటు

కొవిడ్​ నుంచి కోలుకున్న వారిలో పెరుగుతున్న గుండె పరిమాణం!

గుజరాత్​ రాజ్​కోట్​లో 70 కార్డియోమెగాలి కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

– కొవిడ్​ నుంచి కోలుకున్నవారిలోనే ఈ వ్యాధి తీవ్రత ఉన్నట్లు పేర్కొన్నారు.

★ కరోనా వైరస్​ రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో మ్యూకోర్మైకొసిస్​, బ్లాక్​ ఫంగస్, మల్టీ సిస్టమ్ ఇన్​ఫ్లమేటరీ సిండ్రోమ్(ఎమ్​ఐఎస్) కేసులు వెలుగుచూశాయి.

★ అయితే.. గుజరాత్ రాజ్​కోట్​​లో కొత్తగా 70కిపైగా కార్డియోమెగాలి(గుండె పరిమాణం పెరగడం) కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

★ కొవిడ్​ నుంచి కోలుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపించినట్లు స్పష్టం చేశారు.

★ కార్డియోమెగాలి బాధితుల్లో.. 15 నుంచి 25 శాతం మంది కొరొనరీ హర్ట్​ డిసీజ్​ వల్లే మరణించారని అధికారులు తెలిపారు.

★ “కరోనా ఊపిరితిత్తులపై మాత్రమే ప్రభావం చూపదు. కొవిడ్​ రోగుల్లో.. రక్తం గడ్డకట్టడం మొదలైన సమస్యలూ తలెత్తాయి. చాలా మంది కరోనా రోగులు కార్డియోమెగాలితో బాధపడుతున్నారు.” – డాక్టర్. సందీప్ హర్సోరా, ఐసీయూ స్పెషలిస్ట్.

పెరిగిన గుండెపోటు మరణాలు..

★ కొవిడ్​ నుంచి కోలుకున్న 30-45 ఏళ్ల మధ్య వయసువారిలో గుండెపోటు మరణాలు కూడా పెరిగాయి.

★ అయితే.. వీరిలో గుండెపోటు లక్షణాలతో బాధపడ్డవారు తక్కువేనని అధికారులు తెలిపారు.

★ రక్తకణాలపై కొవిడ్​ తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో.. కొరొనరీ హర్ట్​ అటాక్​ వంటి సమస్యలు తలెత్తుతాయి.