Politics

రెండో ఏడాది జగనన్న చేదోడు’ నగదు విడుదల

రెండో ఏడాది జగనన్న చేదోడు’ నగదు విడుదల

ఆంధ్రా రాష్ట్రంలో రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం వరుసగా రెండో ఏడాది ‘జగనన్న చేదోడు’ నగదు విడుదల కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 2,85,350 మంది రజక, నాయీబ్రాహ్మణ, దర్జీలకు రూ.285.35 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు.

ఈ ఏడాది షాపులున్న 1,46,103 మంది టైలర్లకు రూ. 146.10 కోట్లు, షాపులున్న 98,439 మంది రజకులకు రూ. 98.44 కోట్లు, షాపులున్న 40,808 మంది నాయీబ్రాహ్మణులకు రూ. 40.81 కోట్లు లబ్ధి చేకూరనుంది. జగనన్న చేదోడు పథకం కింద షాపులున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ. 10 వేల ఆర్థిక సాయంగా ముఖ్యమంత్రి జగన్‌ అందిస్తున్న విషయం తెలిసిందే.

మంగళవారం విడుదల చేస్తున్న రూ.285.35 కోట్లతో కలిపి ఇప్పటివరకు ఈ పథకం కింద జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.583.78 కోట్లు. లంచాలకు, వివక్షకు తావులేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితానుంచి, సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి లబ్ధిదారులను ఎంపికచేశారు. పాత అప్పులకు జమచేసుకోలేని విధంగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.