Devotional

తెలంగాణా కుంభమేళా ప్రారంభం – చిత్రాలు

తెలంగాణా కుంభమేళా ప్రారంభం

తెలంగాణ కుంభమేళాగా ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర.. నేటి నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు వైభవంగా జరగనుంది. వన దేవతలు జనం నడుమ మొక్కులందుకోనున్నారు. ఇప్పటికే భక్తుల కిటకిటతో మేడారం పరిసరాల్లో జనసంద్రం నెలకొంది. మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ నెల19 వరకు అంగరంగ వైభవంగా జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 18న వన దేవతలను దర్శిస్తారు. తెలంగాణ కొంగు బంగారంగా భావించే మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. దాదాపు నలభై వేల మంది సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మొత్తం కోటిన్నర మంది వరకు సందర్శించే వీలుందనేది అధికారుల అంచనా వేస్తున్నారు.

మేడారం మహాజాతరలో తొలి ఘట్టం గద్దెలపైకి సారలమ్మ రావడం. బుధవారం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి నుంచి అమ్మవారి ప్రతిరూప మైన పసుపు, కుంకుమ తీసుకుని మేడారానికి బయలుదేరుతారు. మేడారంలోని సమ్మక్క గుడి​ వద్ద పగిడిద్దరాజు, సమ్మక్క పెండ్లి జరుగుతుంది. తర్వాత సారలమ్మ గద్దెపై కొలువుదీరుతుంది. పగిడిద్దరాజు పూనుగొండ్లలో, గోవిందరాజులు కొండాయిలో కొలువై ఉన్నారు. వీళ్లిద్దరినీ బుధవారమే గద్దెకు తీసుకొస్తారు.

*గురువారం: సమ్మక్క తల్లి రాక
రెండో రోజు చిలుకల గుట్టలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి మేడారంలోని గద్దెపై ప్రతిష్టిస్తారు. ములుగు జిల్లా ఎస్పీ గాలిలోకి మూడు రౌండ్లు పేల్చి అమ్మను తీసుకొస్తున్నట్లు సంకేతాలి స్తారు. అమ్మవారిని తీసుకొచ్చే దారి పొడవునా భక్తులు ముగ్గులు వేస్తారు. ఆ సమయంలో భక్తులు పూనకంతో ఊగి పోతారు.

*శుక్రవారం: మొక్కుల సమర్పణ
మూడో రోజు అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు దీరి భక్తులకు దర్శన మిస్తారు. భక్తులు అమ్మవార్లకు పసుపు, కుంకుమ, నూనె కలిపిన ఒడి బియ్యం, బంగారమని పిలిచే బెల్లం సమర్పిస్తారు

*శనివారం: వన ప్రవేశం
నాలుగో రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలందరినీ తిరిగి తీసుకెళ్తారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ వేడుక జరుగుతుంది. వేడుక మొత్తం వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజన పూజారులే నిర్వహిస్తారు.

medaram-1

మేడారం మహాజాతర ప్రారంభమైంది. జన జాతరకు భక్తులు.. భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే మేడారం చుట్టుపక్కల జన సంద్రమైంది. దారులన్నీ మేడారం వైపే అన్నట్లు.. తెలంగాణవ్యాప్తంగా జనం తరలివెళ్తున్నారు. వన దేవతల మొక్కులు తీర్చుకునేందుకు, నిలువెత్తు బంగారం సమర్పించుకునేందుకు, చీరె, సారెలు అమ్మలకు ఇచ్చేందుకు.. దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు.

medaram-2

మేడారం జనజాతరలో ఇవాళ తొలిఘట్టం ఆవిష్కృతం కానుంది. జాతరలో సారలమ్మ గద్దెల పైకి రావడం తొలి ఘట్టం. కన్నెపల్లిలోని సారలమ్మ గుడి నుంచి అమ్మ ప్రతిరూపమైన పసుపు, కుంకుమ మేడారానికి తీసుకొస్తారు. ముందు మేడారంలోని సమ్మక్క గుడి దగ్గర పగిడిద్దరాజు, సమ్మక్క పెళ్లి జరుగుతుంది. తర్వాత సారలమ్మ గద్దెపై కొలువు దీరుతుంది. పూనుగొండ్లలో పగిడిద్దరాజు, కొండాయిలో గోవిందరాజులు కొలువై ఉన్నారు. వీళ్లిద్దరినీ ఇవాళే గద్దెకు తీసుకొస్తారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పొనుగండ్ల గ్రామం నుంచి ఇప్పటికే మేడారం బయుల్దేరాడు పగిడిద్దరాజు. పెనుక వంశీయులు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసి పగిడిద్దరాజును తీసుకుని ఊరేగింపుగా వస్తున్నారు. దాదాపు 80 కిలోమీటర్ల దూరం అడవిలో నడుస్తూ పగిడిద్దరాజుతో మేడారానికి చేరుకోనున్నారు ఆదివాసీలు. ఇవాళ గద్దెల మీదకు చేరుకోనున్నాడు పగిడిద్దరాజు.

medarm-3

రెండోరోజు చిలుకుల గుట్టలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి మేడారంలోని గద్దె మీద ప్రతిష్టిస్తారు. ములుగు జిల్లా ఎస్పీ గాల్లోకి 3 రౌండ్లు పేల్చి అమ్మకు స్వాగతం పలుకుతారు. అమ్మవారిని తీసుకొచ్చే దారి పొడవునా భక్తులు ముగ్గులు వేస్తారు. ఆ సమయంలో భక్తులు డప్పు చప్పుళ్లతో పూనకాలతో ఊగిపోతారు. మేడారం మహా జాతరలో ఇదే ప్రధాన ఘట్టం. సమ్మక్కను తీసుకొస్తున్న పూజారులను తాకేందుకు.. అమ్మకు స్వాగతం పలికేందుకు దారిపొడవునా.. ఇసుకేస్తే రాలనంతగా భక్తులుంటారు. మూడో రోజు అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువుదీరి భక్తులను దర్శనమిస్తారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమలు , చీర , సారె, నూనె కలిపిన ఒడిబియ్యం, బంగారంగా పిలుచుకొనే బెల్లాన్ని సమర్పిస్తారు. నాలుగోరోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలందరినీ తిరిగి అడవికి తీసుకెళ్తారు పూజారులు. వేడుక మొత్తం వంశపారంపర్యంగా వస్తున్న గిరిజన పూజారులే చేయడం ఆనవాయితీ.

medarm-4

medarm-5

medarm-6

medarm-7

273621471-4589397277835336-2778905432341370253-n

273724729-4589395984502132-5188308517983762684-n