NRI-NRT

రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం అధ్వర్యంలో దీపావళి

రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం అధ్వర్యంలో దీపావళి

సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో ఇటీవల ప్రవాసాంధ్రులు రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం అధ్వర్యంలో దీపావళి సంబురాలను ఉత్సహాభరితంగా ఆనందోత్సవాల మద్య జరుపుకోన్నారు.

గత నాలుగు సంవత్సరాలుగా తాము రియాధ్ నగరంలో ఉమ్మడి కుటుంబంగా దీపావళిను జరుపుకోంటున్నట్లుగా ప్రధాన నిర్వహకుడయిన తిరుపతి స్వామి స్వర్ణ అలియాస్ స్వామి తెలిపారు.

సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా తెలుగు సంస్కృతిను ప్రతిబింబించె విధంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్య కార్యక్రమాలను మురారి, బిందు, శ్రీదేవి, రమ్య మరియు అక్షితలు పర్యవేక్షించడమె కాకుండ ప్రదర్శనకారులకు శిక్షణ కూడ ఇచ్చారు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లను మధు, ప్రసాద్, నటరాజ్, మహెంద్ర మరియు భాస్కర్ లు పర్యవేక్షించడకం జరిగింది.

కార్యక్రమ నిర్వహణలో నటరాజ్, భరణి, అనిల్ మర్రి, వినయ్, సుఖేశ్, నాగేంద్ర, విజయ్, శేషు, శ్రవణ్, విశ్వలు సహకరించారని స్వామి తెలియజేసారు. రియాధ్ నగరంలోని తోటి తెలుగు ప్రవాసీయులందరు కలిసి సహకరించడంతో దీపావళి వైభవంగా జరిగిందని ఆయన అన్నారు.

రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం అధ్వర్యంలో తాము గత నాలుగు సంవత్సరాలుగా దీపావళి మరియు సంక్రాంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా నిర్వహాకులు తెలిపారు. తెలుగు పెద్దలు అంటోని సూచనలు, తోడ్పాటుతో తాము తెలుగు వారికి సేవలందిస్తున్నట్లుగా స్వామి వెల్లడించారు. హెల్పింగ్ హాండ్స్ రియాధ్ అనే పేర తాము ఆపదలో ఉన్న ప్రవాసీయులకు సహాయక చర్యలను కూడ చేపట్టినట్లుగా స్వామి తెలిపారు. హెల్పింగ్ హాండ్స్ ను తాము 2020లో నెలకోల్పినట్లుగా ఆయన వెల్లడించారు.

కోవిడ్ సంక్షోభ సందర్భంగా తెలుగు ప్రవాసీయులతో పాటు బంగ్లాదేశీయులు, నేపాలీయుల మోత్తం 150 మందికు తాము ఆహార సామాగ్రిను అందించినట్లుగా ఆయన చెప్పారు. కొన్ని సందర్భాలలో మృతదేహాలను స్వదేశానికి పంపించడంలో సహాకరించామని అదే విధంగా ఆపదలో ఉండి టిక్కేట్ కొనలేని కొందరికి టికేట్లు కూడ సమకూర్చినట్లుగా స్వామి చెప్పారు.

భాస్కర్ బొమ్మి (కడప), వెంకట్ (హైద్రాబాద్) శరత్ లు కలిసి 2020లో హెల్పింగ్ హ్యాండ్ రియాధ్ ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారని ఆయన పెర్కోన్నారు.

ఇతర సంఘాల తరహా అందరి నుండి కాకుండ తమ సభ్యులె కొంత మంది కలిసి తమకు తోచిన విధంగా విరాళాలు ఇచ్చి ఆపదలో ఉన్న వారిని ఆదుకోంటున్నట్లుగా స్వామి చెప్పారు. తమ సంఘంలో ఎవరు కూడ అధినాయకులు లేరని, అందరు సమాన భాగస్వాములమని అందరి సమిష్ఠి నిర్ణయాలతో ముందుకు వెళ్తామని ఆయన నొక్కి చెప్పారు.