Business

ఎయిరిండియా విమానంలో పాము

ఎయిరిండియా విమానంలో పాము

ఎయిర్‌ ఇండియా(AirIndia) విమానంలో పాము కలకలం సృష్టించింది. కోల్‌కతా నుంచి బయల్దేరిన విమానం దుబాయ్‌(Dubai) ఎయిర్‌పోర్టు(Airport)లో ల్యాండ్‌ అయిన తర్వాత విమానాశ్రయ సిబ్బంది పాముని గుర్తించారు. ఈమేరకు డైరెక్టర్ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) వెల్లడించింది. కోల్‌తా నుంచి కేరళ మీదుగా దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్‌ అయిన తర్వాత ప్రయాణికులంతా దిగిపోయారు. చివరిగా కార్గో కేబిన్‌ను చెక్‌ చేస్తుండగా పాము కనిపించింది. దీంతో అత్యవసర సిబ్బంది వచ్చి దానిని బయటకి తీశారు. అయితే, కార్గో క్యాబిన్‌లోకి పాము ఎలా వచ్చి చేరిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఎయిర్‌ ఇండియా అధికారులు వెల్లడించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.