Devotional

ఏడాదికోసారి తెరిచే వెయ్యేళ్ల శివాలయం

ఏడాదికోసారి తెరిచే వెయ్యేళ్ల శివాలయం

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు 48 కిలోమీటర్ల దూరాన రాయ్న్ జిల్లాలో ఉన్న సోమేశ్వరాలయం శనివారం తెరుచుకోనుంది.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాలు 48 కిలోమీటర్ల దూరాన రాయ్ సెన్ జిల్లాలో ఉన్న సోమేశ్వరాలయం శనివారం తెరుచుకోనుంది. ఏడాది పొడవునా మూసి ఉంచే ఈ ఆలయాన్ని మహా శివరాత్రి రోజున మాత్రమే తెరవడం ప్రత్యేకత. వెయ్యి అడుగుల ఎత్తయిన కొండపై ఉన్న ఈ శివాలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించగా. పలువురు ముస్లిం రాజులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆలయాన్ని సామాన్య ప్రజల కోసం తెరవాలంటూ 1974లో ఉద్యమం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి ప్రకాష్ సేథీ సోమేశ్వరాలయం తాళం తీసి.. శివరాత్రి రోజున మాత్రమే పూజలు నిర్వహించేందుకు అనుమతించారు. ప్రస్తుతం పురావస్తుశాఖ నిర్వహణలో ఉన్న ఈ ఆలయాన్ని మహా శివరాత్రి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 12 గంటలపాటు తెరుస్తారు. శనివారం నాటి పర్వదినానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా అధికసంఖ్యలో భక్తులు తరలివస్తారని భావిస్తున్నారు.
అయిదు క్వింటాళ్ల కిచిడీ, పండ్లను భక్తులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.