Health

కర్ణాటకలో పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రభుత్వం అలర్ట్

కర్ణాటకలో పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రభుత్వం  అలర్ట్

కర్ణాటకలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అత్యవసర సమీక్ష నిర్వహించిన ఆ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ కె.సుధాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని చిన్నారులు, 65 ఏళ్లు పైబడ్డ వృద్ధులు, దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు జనసందోహం ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు. వైద్య సిబ్బంది తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశించారు.