Business

మళ్లీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!

మళ్లీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!

దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గురువారం ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడుకుల మధ్య కదలాడాయి.

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గురువారం ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు రోజంతా తీవ్ర ఒడిదుడుకుల మధ్య కదలాడాయి. మిడ్-సెషన్‌కు ముందు వరకు మిశ్రమంగా ర్యాలీ చేసిన తర్వాత ఐటీ రంగం షేర్లపై పెరిగిన అమ్మకాల ఒత్తిడితో పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లోని షేర్ల నుంచి లాభాల స్వీకరణ కారణంగా మొత్తం స్టాక్ మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి.

వీటికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు పెరగడం, అమెరికా ఫెడ్ 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను పెంచడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 289.31 పాయింట్లు కోల్పోయి 57,925 వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు నష్టపోయి 17,076 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, రియల్టీ, ఐటీ, ఫైనాన్స్ రంగాలు నీరసించగా, మెటల్, ఫార్మా రంగాలు స్వల్పంగా రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో నెస్లే ఇండియా, మారుతీ సుజుకి, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, ఐటీసీ, హిందూస్తాన్ యూనిలీవర్ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి.

ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్, కోటక్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.24 వద్ద ఉంది.