వైసీపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసిన స్వరూపానందేంద్ర సరస్వతి ||* ◾
▪️సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై “విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ” తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
▪️సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
▪️ నా జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం చూడలేదు: స్వరూపానందేంద్ర సరస్వతి
▪️పోలీసులను గుంపులుగా పెట్టారు తప్ప ఏర్పాట్లు సరిగా లేవని విమర్శించారు.
▪️తన జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హజరయ్యానని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు.
▪️ఎందుకు దర్శనానికి వచ్చానా అని బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు.
▪️ కొండ కింది నుంచి పైవరకు రద్దీ ఉన్నా జవాబు చెప్పేవారు లేరన్నారు.
▪️తన జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం ఎప్పుడూ చూడలేదని.
▪️భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయని చెప్పారు.
▪️భక్తుల ఇబ్బందుల మధ్య దైవదర్శనం బాధ కలిగించిందని స్వరూపానందేంద్ర అన్నారు.