Politics

కాంగ్రెస్ గెలిస్తే RTCలో ఉచిత ప్రయాణం: రాహుల్

కాంగ్రెస్ గెలిస్తే RTCలో ఉచిత ప్రయాణం: రాహుల్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లపై కాంగ్రెస్ పార్టీ వరాల జల్లులు కురిపిస్తోంది. ఉడిపి ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహిళల కోసం కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మహిళలందరికీ ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఇప్పటికే గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్నభాగ్య, యువనిధి పేరుతో కాంగ్రెస్ నాలుగు హామీలు ఇచ్చింది.