DailyDose

TNI నేటి నేర వార్తలు. కంకిపాడు సిఐ సస్పెన్షన్ తదితర విశేషాలు.

TNI  నేటి నేర వార్తలు. కంకిపాడు సిఐ సస్పెన్షన్ తదితర విశేషాలు.

* కంకిపాడు సిఐ పరమేశ్వరావుపై సస్పెన్షన్ వేటు..

ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ జాషువా గారు.

కంకిపాడు పీఎస్ పరిధిలో శాంతి భద్రల పర్యవేక్షణలో విఫలమైనందుకు క్రమ శిక్షణలో భాగంగా సిఐపై వేటు.

గన్నవరం సిఐ కనకారావుకు అదనపు బాధ్యతలు.

* TSInterResults: 8 మంది బలవన్మరణం

ఇంటర్ ఫలితాలు విద్యార్థుల పాలిట పాశాలుగా మారుతున్నాయి. నిన్న విడుదలైన TS ఇంటర్ ఫలితాల తర్వాత రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో 8 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అటు మహబూబాబాద్లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఫెయిల్ అవుతాననే భయంతో కృష్ణ అనే విద్యార్థి ఫలితాలకు ముందే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానీ నిన్న రిజల్ట్ చూస్తే అతడికి 892 మార్కులొచ్చాయి.

* నెరెడ్నెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేర్వేరు కారణాలతో నిన్న ఒక్కరోజే నలుగురు ఆత్మహత్య ప్రయత్నాలు.

అందులో ముగ్గురు మరణించగా ఒక అమ్మాయి ప్రస్తుతం ట్రీట్మంట్ తీసుకుంటుంది.

నిన్న వచ్చిన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన రేవంత్ కుమార్ మరణించగా ఇంకొక అమ్మాయి చావు బతుకుల మధ్య కొట్లాడుతుంది.

షరీఫ్, సాయిబాబా అనే యువకులు వేరే కారణాలతో ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు.

* బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రోడ్ నెంబర్ 12 లోని లోటస్ పాండ్ చెరువులో భారీగా చేపల మృతి..

వేల సంఖ్యలో చనిపోయి నీళ్లపై తేలుతున్న చేపలు..

ఆందోళన వ్యక్తం చేస్తున్న వాకర్లు..

రంగంలోకి దిగిన పిసిబి అధికారులు.. ఫిషరీస్ అధికారులు

* వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్‍కుమార్ రెడ్డికి రిమాండ్ పొడిగించిన సీబీఐ కోర్టు -వివేకా హత్య కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న భాస్కర్ రెడ్డి, ఉదయ్‍కుమార్ రెడ్డి – భాస్కర్ రెడ్డి, ఉదయ్‍కుమార్ రెడ్డికి వచ్చే నెల 2 వరకు రిమాండ్ పొడిగింపు

* BIG BREAKING NEWS
పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బీటెక్ రవి గారి మీద చక్రాయపేటలొ పెట్టిన అక్రమ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.

* మచిలీపట్నంలో రెచ్చిపోతున్న గంజా ముఠా..

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు..

గంజాయి ముఠా దాడిలో వ్యక్తికి గాయాలు మూడు రోజులు గడుస్తున్నా కేసు నమోదు కాని వైనం.

మచిలీపట్నం గుమస్థాల కాలనీలో నివాసం ఉంటున్న ఎరుకుల కులానికి చెందిన వ్యక్తి ఆదివారం రాత్రి మూత్ర విసర్జనకు వెళ్లగా అప్పటికే వాటర్ సంపు పైన కుర్చుని గంజాయి తాగుతూ మధ్య సేవిస్తున్న నలుగురు వ్యక్తులు మద్యం బోటిళ్లతో దాడి చేసి ఆ వ్యక్తిని గాయపరిచారు.

మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా ఇప్పటి వరకు కేసు నమోదు కాకపోవడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

*

Sir for scrolling

డిజిపి శ్రీ కె. వి. రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏసిబి 14400 కాల్ సెంటర్, ఏసిబి యాప్ ద్వారా అవినీతి అధికారులపై వచ్చిన ఫిర్యాదుతో ప్రకాశం జిల్లా, కంబం సబ్-రిజిస్ట్రార్ శ్రీరామ శ్రీరామ మూర్తి సూచనల మేరకు బాధితుడి నుండి 15,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన డాక్యుమెంట్ రైటర్, శ్రీ బాలబద్రుని రామచంద్రరావు.