Business

2 వేల నోట్లు 50 శాతం వెనక్కి వచ్చేశాయని ఆర్బీఐ వ్యాక్యాలు….

2 వేల నోట్లు 50 శాతం  వెనక్కి వచ్చేశాయని ఆర్బీఐ వ్యాక్యాలు….

ఇటీవల రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే నోట్ల బదిలీకి ఆర్బీఐ సెప్టెంబర్ 30 వరకు గడువిచ్చింది. ఇప్పుడు తాజాగా రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే చలామనిలో ఉన్న రూ.2 వేల నోట్లలో 50 శాతం నోట్లు వెనక్కి వచ్చేశాయని పేర్కొంది. నోట్ల ఉపసంహరణ ప్రకటించిన 20 రోజుల్లోపే ఇది సాధ్యమైందని తెలిపింది. ఇప్పటివరకు వెనక్కి వచ్చిన ఈ 50 శాతం నోట్ల విలవ రూ.1.82 లక్షల కోట్లని వెల్లడించింది.వీటిలో దాదాపు 85 శాతం ఓట్లు బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడం వల్లే వచ్చాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. మార్చి 31 నాటికి రూ.2 వేల నోట్లు రూ.3.62 లక్షల కోట్లు చలామనిలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడు సగం నోట్లు వచ్చేశాయన్నారు. అయితే సెప్టెంబర్ 30 వరకు చివరి తేది ఉన్నందున్న చివరి సమయంలో నోట్లు డిపాజిట్ లేదా మార్చుకోవడం చేయొద్దని సూచించారు. నోట్ల మార్పిడి కోసం రిజర్వ్ బ్యాంక్‌లో సరిపడా కరెన్సీ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు.