Agriculture

స్పెయిన్ అడవుల్లో అగ్ని ప్రమాదం

స్పెయిన్ అడవుల్లో అగ్ని ప్రమాదం

స్పెయిన్‌ దేశంలోని కెనరీ దీవుల్లోగల అడవుల్లో కార్చిచ్చు కలకలం రేపుతోంది. అగ్నికీలలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దాంతో అధికారులు అటవీ సమీప గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటివరకు 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరికొందరు తమ నివాసాలను వీడేందుకు నిరాకరిస్తుండటంతో బలవంతంగా తరలిస్తున్నారు.ఇప్పటివరకు ఈ కార్చిచ్చు కారణంగా 11 వేల ఎకరాల అటవీ ప్రాంతం తగులబడిపోయింది. వాటర్‌ డ్రాపింగ్‌ ప్లేన్‌లు, 10 హెలిక్యాప్టర్‌ల సాయంతో అధికారులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కార్చిర్చు పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. విస్తరిస్తున్న అగ్ని కీలలు ఇప్పటికే దాదాపు 3000 భవనాలను బుగ్గి చేశాయి.

కెనరీ దీవుల్లోని లా పాల్మా కొండపైన ఈ కార్చిచ్చు మొదలైంది. అక్కడ ఓ అగ్నిపర్వతం బద్దలవడమే ఈ కార్చిచ్చుకు కారణమైంది. ఈ కార్చిచ్చు వల్ల ఇప్పటి వరకు ఎవరూ ప్రాణాలు కోల్పోక పోయినా అరటి తోటలతోపాటు ఇతర వ్యవసాయ పంటలు తగులబడిపోయాయి. కార్చిచ్చును అణచడం కోసం మరిన్ని ప్లేన్‌లు, హెలిక్యాప్టర్లను రంగంలోకి దించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.