వైకాపా సీనియర్ నేత దుట్టా రామచంద్రరావుతో ఆ పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkata Rao) భేటీ అయ్యారు. ఓ కేసు విషయమై కోర్టు వాయిదాకు వెళ్తూ.. హనుమాన్ జంక్షన్లో పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. తాను తెదేపాలోకి వెళ్లే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా కార్యకర్తలతో యార్లగడ్డ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో వైకాపా పార్టీ నుంచి.. లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే విషయంపై సందిగ్ధంలో ఉన్నట్లు చెప్పారు. సీఎం జగన్తో సమావేశం అనంతరం దీనిపై నిర్ణయం వెల్లడిస్తానని తెలిపారు. అనివార్య కారణాలతోనే 2019 ఎన్నికల తర్వాత నియోజకవర్గ కార్యకర్తలకు దూరంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ గన్నవరం నుంచే పోటీ చేస్తానని కార్యకర్తలకు వెంకట్రావు తేల్చి చెప్పారు.
తెదేపాలోకి వెళ్లను. అవసరమైతే స్వతంత్రంగా పోటీచేస్తా.
Related tags :