Politics

పోలవరానికి జగనే శని: చంద్రబాబు

పోలవరానికి జగనే శని: చంద్రబాబు

సీఎం జగన్‌ పై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం తరతరాల ఆకాంక్ష… పోలవరం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ఓ వరం అన్నారు. కానీ పోలవరానికి జగనే శని…. అహకారంతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని ఫైర్‌ అయ్యారు. ఆన శని పోతేనే పోలవరం కల సాకారం అవుతందన్నారు. పోలవరం పూర్తైతే ఏపీలోని అన్ని ప్రాజెక్టులకు నీళ్లివ్వొచ్చు…లక్షల ఎకరాలకు నీళ్లివ్వచ్చు అని స్పష్టం చేశారు చంద్రబాబు.పరిశ్రమల అవసరాలకు నీటి సౌకర్యం కల్పించవచ్చని… విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చన్నారు. పోలవరం ఏపీకి జీవనాడి….పోలవరం పునరావాసానికి టీడీపీ హయాంలో రూ. 4114 కోట్లు ఖర్చు పెట్టామని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో నిర్వాసితుల కోసం కేవలం రూ. 1890 కోట్లే ఖర్చు చేశారు.. పోలవరం నిర్వాసితులకు ఎకరానికి రూ. 19 లక్షలు ఇస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని ఆగ్రహించారు. పరిహరం ఇవ్వకపోగా లబ్దిదారుల జాబితా మార్చి అవకతవకలకు పాల్పడ్డారని.. ప్రమాణ స్వీకారం రోజునే పోలవరం పనులను నిలిపేసిన ఘనత జగనుదేనంటూ చురకలు అంటించారు చంద్రబాబు. సుమారు 15 నెలల పాటు పోలవరం వద్ద ఎలాంటి నిర్మాణ సంస్థే లేకుండా చేశారని ఆగ్రహించారు.