Business

ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకూ జీపీఎస్‌

ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకూ జీపీఎస్‌

ఆర్టీసీ ఉద్యోగులకూ జీపీఎస్‌ అమలు చేస్తామని ఏపీఎస్‌ ఆర్టీసీ డైరెక్టర్‌ ఎ.రాజారెడ్డి తెలిపారు. డోర్‌ డెలివరీ మాసోత్సవాల సందర్భంగా ఆదివారం శ్రీకాకుళం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. త్వరలో వారికీ జీపీఎస్‌ను అమలులోకి తీసుకువస్తాం. 1,500 డీజిల్‌, 1,000 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నాం’ అని పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z