Politics

దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మోడీ

దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మోడీ

భారత ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా ప్రధాని ఇలా రాసుకొచ్చారు. “అందరికీ దీపావళి శుభాకాంక్షలు! ఈ ప్రత్యేకమైన పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, అద్భుతమైన ఆరోగ్యాన్ని తీసుకు రావాలని కోరుకుంటున్నాను. కాగా ఈ రోజు ప్రధాని ఈ దీపావళి వేడుకలను జమ్మూలో సైనికులతో కలిసి జరుపుకోనున్నట్లు తెలుస్తుంది.జమ్మూలోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న చుంబ్ సెక్టార్‌లో భారత ఆర్మీ సైనికులతో కలిసి ప్రధాని ఈ ఏడాది దీపావళి జరుపుకోనున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రధాని పర్యటనకు సంబంధించి శనివారం అర్థరాత్రి వరకు సైన్యం లేదా జమ్మూ కాశ్మీర్ పరిపాలన అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదని, అయితే సంబంధిత సైనిక విభాగానికి ఆయన రాక కోసం సన్నాహాలు పూర్తయ్యాయని ఓ నివేదిక తెలిపింది. దీపావళి వేడుకల అనంతరం ప్రధాని మోదీ కూడా సైనికులను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z