Devotional

టీటీడీకి రెండు బస్సుల విరాళం

టీటీడీకి రెండు బస్సుల విరాళం

టీటీడీకి శుక్రవారం ఓ దాత రెండు బస్సులను విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నారాయణరావు రూ.80 లక్షల విలువైన రెండు బస్సుల(Buses) ను అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను ఈవో (TTD EO) ఏవి ధర్మారెడ్డికి అందజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ రవాణా విభాగం జిఎం శేషారెడ్డి, తిరుమల డీఐ జానకిరామరెడ్డి పాల్గొన్నారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ (Devotees Rush) కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 5 కంపార్ట్‌మెంట్లు(Compartments) నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 58, 278 మంది భక్తులు దర్శించుకోగా 17,220 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3. 53 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z