DailyDose

అంగన్వాడీలతో చర్చలు మరోసారి విఫలం

అంగన్వాడీలతో చర్చలు మరోసారి విఫలం

అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలం అయ్యాయి. సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలోని కమిటీ.. అంగన్వాడీ సంఘాల నేతలతో చర్చలు జరిపింది. ప్రస్తుతం వేతనాలు పెంచడం సాధ్యం కాదని.. వచ్చే ప్రభుత్వంలో పెంచుతామని కమిటీ తెలిపింది. వారు కోరుతున్న మొత్తం కంటే ఎక్కువే పెంచుతామని హామీ ఇచ్చింది. అలాంటప్పుడు చర్చలకు ఎందుకు పిలిచారని కమిటీ సభ్యులను అంగన్వాడీ నేతలు నిలదీశారు. వేతనాల పెంపుపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అలా ఇస్తేనే సమ్మె విరమించేందుకు అవకాశం ఉందని అంగన్వాడీ సంఘాల నేతలు తేల్చి చెప్పారు.

భేటీ అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల మాట్లాడుతూ.. ‘‘అంగన్వాడీల 11 డిమాండ్లలో పదింటిని ఆమోదించాం. వేతనాల పెంపుపైనే ప్రధాన సమస్య ఉంది. వారి సమస్యలపై సానుకూలంగానే ఉండాలని సీఎం చెప్పారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ను రూ.1.20 లక్షలకు, హెల్పర్‌ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ను రూ.50వేలకు పెంచుతాం. వేతనాల పెంపుపై ఒక విధానం ఉంది. ఐదేళ్లకు ఒకసారి మాత్రమే పెంచాల్సి ఉంటుంది. ఈ ఏడాది జులై నాటికి ఐదేళ్లు పూర్తవుతాయి. అందుకే వేతనాలను వచ్చే జులైలో తప్పక పెంచుతామని హామీ ఇచ్చాం’’ అని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z