Devotional

గోవింద కోటి రాస్తే తితిదే బ్రేక్ దర్శనం

గోవింద కోటి రాస్తే తితిదే బ్రేక్ దర్శనం

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకొన్నది. 25 ఏండ్లలోపు యువత ‘గోవింద కోటి’ అని పది లక్షల 116 సార్లు రాస్తే శ్రీవారి బ్రేక్‌దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. యువతలో తిరుమల శ్రీవారిపై భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వెల్లడించారు. శుక్రవారం తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈవో ధర్మారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఏప్రిల్‌ నెల శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వసతి గదులు కేటాయింపును ఆన్‌లైన్‌లో చేపట్టినట్టు ధర్మారెడ్డి తెలిపారు. అన్నప్రసాద విభాగాన్ని పునరుద్ధరించినట్టు చెప్పారు. శ్రీవారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుందని వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z