Politics

నిషేధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

ec bans modi web series

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా రూపొందిన వెబ్‌సిరీస్‌ను తాత్కాలికంగా నిషేధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.

‘మోదీ- జర్నీ ఆఫ్‌ ఏ కామన్‌ మ్యాన్‌’ పేరిట ఆన్‌లైన్‌లో స్ట్రీమ్‌ అవుతున్న వెబ్‌సిరీస్‌ను తక్షణమే నిలిపివేయాలని ఈరోస్‌ నౌను ఆదేశించింది.

ఈ మేరకు.. ‘ ప్రధాని మోదీ జీవితం ఆధారంగా రూపొందిన వెబ్‌ సిరీస్‌లోని ఐదు ఎపిసోడ్‌లు ఇప్పటికీ మీ ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. వెంటనే వాటిని నిలిపివేయాల్సిందిగా ఆదేశిస్తున్నాం.

తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ఆపేయాలి. అదే విధంగా వెబ్‌ సిరీస్‌ కంటెంట్‌ను పూర్తిగా తొలగించాలి’ అని ఈసీ పేర్కొంది.