తమిళనాడుకు చెందిన ఓ యువకుడు కేజీ బిర్యానీని ఆరగించాడు. ఎక్కడో ఎవరో బిర్యానీ తింటే వింతేముంది అని అనుకుంటున్నారా? ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆ యువకుడు కేవలం 9 నిమిషాల్లోనే కేజీ బిర్యానీ తినేశాడు. ఈరోడ్ నగరంలోని పెరిదురై రెస్టారెంట్ నిర్వాహకులు బిర్యానీ తినే పోటీ నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 500 మంది రిజిస్టర్ చేసుకోగా నిర్వాహకులు కేవలం 25 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. కేవలం 9 నిమిషాల్లోనే కేజీ బిర్యానీ తిన్నటువంటి రఘుల్ అనే యువకుడు ప్రథమ స్థానంలో నిలిచి రూ. 5 వేలు నగదు బహుమతి అందుకున్నాడు. రెండో స్థానంలో నిలిచిన వ్యక్తి 13 నిమిషాల్లో తినేశాడు.
అరవ తంబి సత్తా చాటాడు. 9మిముషాల్లో కిలో బిరియాని ఫట్!
Related tags :