ప్రముఖ తెదేపా నాయకులు ఏపీ మాజీ స్పీకర్ డా.కోడెల శివప్రసాద్, చిత్తూరు మాజీ ఎంపీ నారిమల్లి శివప్రసాద్లు ఇరువురికీ డాలస్ ఎన్నారై తెదేపా ఘన నివాళి అర్పించింది. అర్వింగ్లోని కూచిపూడి హోటల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయి ప్రసంగించారు. కోడెల తనకు గురుతుల్యులు అని, ఆయనతో కలిసి పార్టీలో పనిచేయడం గర్వంగా ఉందన్నారు. దళిత వర్గానికి చెందిన మాజీ ఎంపీ శివప్రసాద్ ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ వద్ద తన గళాన్ని వినిపించడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రవాసులు కొణిదెల లోకేశ్ నాయుడు, కోండ్రుకుంట చలపతిరావు, వెన్నం మురళీ, చలసాని కిషోర్, చేకూరి కేసీ, కోడెల శ్రీధర్, అన్నే అమర్, కాకరాల విజయ్, గోవాడ అజయ్, సుగన్ చాగర్లమూడి, దొడ్డా సాంబ, పోలవరపు శ్రీకాంత్, నివాస్ జంపని, వెంకట్ జిల్లెళ్లమూడి, అనిల్ వీరపనేని, నవీన్ ఎర్రమనేని, సందీప్ మేక, కిరణ్ తుమ్మల, శ్రీనివాస్ శాఖమూరి, చందు కాజా, నవీన్ గుమ్మడి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. రెండు నిముషాలు మౌనం పాటించిన అనంతరం పలువురు స్థానిక ప్రవాస ప్రముఖులు శివప్రసాద్లు ఇరువురితో తమకున్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు.
శివప్రసాద్లకు డాలస్ ఎన్నారై తెదేపా ఘన నివాళి
Related tags :